Ahmednagar To Ahilyanagar: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా పేరును అహల్యానగర్ (Ahmednagar To Ahilyanagar)గా మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరు మీదుగా అహ్మద్నగర్ను ‘అహల్యానగర్’గా మార్చాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్లను ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్గా మార్చడంతో అహ్మద్నగర్ జిల్లా పేరును కూడా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ను ఇప్పుడు అహల్యానగర్గా పిలవనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ పేరు మీదుగా అహ్మద్నగర్ నగరానికి ‘అహల్యానగర్’గా నామకరణం చేస్తున్నట్లు మంత్రివర్గం ప్రకటించింది. నగరం పేరును మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గతేడాది మేలో తొలిసారిగా ప్రకటించారు.
15వ శతాబ్దంలో నిజాంషాహీ రాజవంశం, అహ్మద్నగర్ నగరాన్ని స్థాపించిన అహ్మద్ నిజాంషా పేరు మీదుగా అహ్మద్నగర్ నగరానికి పేరు వచ్చింది. మహారాష్ట్రలోని నగరాల పేర్లను మార్చడం గురించి మనం మాట్లాడినట్లయితే.. 2022లో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు వరుసగా శంభాజీ నగర్, ధారాశివ్లుగా మార్చబడ్డాయి. ఔరంగాబాద్, ఉస్మానాబాద్లకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టారు.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలన్న డిమాండ్ను తొలిసారిగా శివసేన అధినేత బాల్ థాకరే చేశారు. అనేక దశాబ్దాలుగా ఆయన ఈ డిమాండ్ను లేవనెత్తారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే తన ప్రభుత్వం పతనానికి ముందు ముఖ్యమంత్రిగా తన చివరి క్యాబినెట్ సమావేశంలో ఈ పేర్లను మార్చాలని నిర్ణయించుకున్నారు. అయితే మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సిపి ఈ నిర్ణయం పట్ల సంతోషంగా లేవని సమాచారం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
We’re now on WhatsApp : Click to Join