NIA Chief : ఓ వైపు ఎన్నికల కోలాహలం మొదలైన వేళ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియామకాలు చేపట్టింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కొత్త చీఫ్గా సదానంద్ వసంత్ దేత్ను నియమించింది. దీంతో పాటు మరో కీలక విభాగాలకు కూడా కొత్త అధిపతులను నియమించింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్గా పీయూష్ ఆనంద్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ (బీపీఆర్డీ) డైరెక్టర్ జనరల్గా రాజీవ్ కుమార్ శర్మలను నియమిస్తూ ఉత్తర్వులు(NIA Chief) జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా నియమితులైన సదానంద్ మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 31న పదవీ విమరణ చేయనున్న ప్రస్తుత ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా స్థానంలో సదానంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2026 డిసెంబర్ 31 వరకు ఎన్ఐఏ చీఫ్గా సదానంద్ వ్యవహరించనున్నారు.