LS Speaker’s Election: రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. కాంగ్రెస్ ఎంపీలందరూ రావాలి

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఎన్నికలు రేపు అంటే బుధవారం జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు జూన్ 26న సభకు హాజరుకావాలని లోక్‌సభలోని తమ ఎంపీలకు కాంగ్రెస్ మూడు లైన్ల విప్ జారీ చేసింది.

Published By: HashtagU Telugu Desk
LS Speaker's Election

LS Speaker's Election

LS Speaker’s Election: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఎన్నికలు రేపు అంటే బుధవారం జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు జూన్ 26న సభకు హాజరుకావాలని లోక్‌సభలోని తమ ఎంపీలకు కాంగ్రెస్ మూడు లైన్ల విప్ జారీ చేసింది.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ తరపున ఎంపీలకు రాసిన లేఖలో “చాలా ముఖ్యమైన అంశాన్ని రేపు లోక్‌సభకు తీసుకువస్తామని, లోక్‌సభలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ దయచేసి హాజరు కావాలని అభ్యర్థించారు. విపక్షాల నుంచి లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కే సురేష్ కాంగ్రెస్ ఈ విప్ జారీ చేశారు. అదే సమయంలో బిజెపి తన ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. బుధవారం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక కోసం సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది.

1952 తర్వాత తొలిసారిగా 18వ లోక్‌సభలో స్పీకర్ పదవి కోసం పోరు జరిగింది. నిజానికి ఇండియా కూటమికు చెందిన కె. సురేష్‌పై ఎన్‌డిఎ నుంచి ఓం బిర్లా పోటీ చేస్తున్నారు. తొలుత స్పీకర్ పదవికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరగా, దాన్ని అంగీకరించేందుకు ఎన్డీయే నిరాకరించింది. దానికి ఏకాభిప్రాయం కుదరలేదు.

Also Read: Leech Found In Nose: ముక్కులో జలగ.. వామ్మో ఎంత రక్తం పీల్చిందో

  Last Updated: 26 Jun 2024, 12:25 AM IST