Site icon HashtagU Telugu

Phase 5 Polling : మే 20న ఐదో విడత పోలింగ్.. కీలక అభ్యర్థులు, స్థానాలివే

Lok Sabha Phase 5 Polling

Lok Sabha Phase 5 Polling

Phase 5 Polling : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ మే 20న(సోమవారం) జరగనుంది. దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని 49 లోక్‌సభ స్థానాలలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ (Phase 5 Polling) ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

ఐదో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, మహారాష్ట్రలోని 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లోని 7 స్థానాలు, బిహార్, ఒడిశాలలోని చెరో 5 స్థానాలు, జార్ఖండ్‌లోని 3 స్థానాలు,  కశ్మీర్, లడఖ్‌లోని చెరో స్థానంలో పోలింగ్ జరగనుంది. ఐదో విడత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ అత్యంత కీలకమైన స్థానం. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ గెలిచారు. ఇక అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు.

Also Read :Hospital Airdrop : ఆకాశం నుంచి ఊడిపడిన హాస్పిటల్.. ఎలా ?

ఐదో విడతలో కీలక అభ్యర్థులు వీరే.. 

Also Read :Neeraj Chopra: చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా.. గోల్డ్ మెడ‌ల్ కొట్టాడు..!

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మొదటి నాలుగు విడతల పోలింగ్ ఏప్రిల్ 19, 26, మే 7, 13 తేదీల్లో జరిగింది. ఐదో విడత పోలింగ్ సోమవారం రోజు జరగనుంది.  చివరి రెండు దశల పోలింగ్ మే 25, జూన్ 1 తేదీల్లో జరుగుతుంది. జూన్ 4న 542 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read :Shruthi Hassan : శృతి హాసన్ డిమాండ్ అలా ఉంది.. ఆ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్న అమ్మడు..!