ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఆగ్రాలోని సీనియర్ న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాదిపై చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానని బాధితురాలు వాపోయింది. న్యాయవాది తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అసభ్యకర వీడియోలు తీశాడని, తన నుంచి రూ.40 లక్షలు వసూలు చేశాడని బాధితురాలు ఆరోపించింది. తాను చాలాసార్లు పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తనకు ఎదురైన బాధను చెప్పుకునేందుకు పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లానని ఆమె పేర్కొంది. న్యాయవాది కొన్ని నెలల క్రితం పట్టణంలో చర్చనీయాంశంగా మారారు. అతని ఫోన్ దొంగిలించబడింది. ఫోన్లో రికార్డ్ చేసిన పలువురు మహిళలతో అతను సన్నిహిత క్షణాల వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనను న్యాయవాది లైంగికంగా వేధించారని ఆగ్రా కమిషనర్ ప్రీతీందర్ సింగ్ను ఓ మహిళ ఆశ్రయించింది. జనవరి 4న న్యాయవాది తనను తన ఇంటికి పిలిపించి, తన అసభ్యకరమైన వీడియోలను వైరల్ చేయడం ద్వారా పరువు తీస్తానని బెదిరించి అత్యాచారం చేశాడని ఆమె కమిషనర్కు తెలిపింది,.
అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. తన నుండి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ న్యాయవాది ఇప్పటికే సికంద్రా పోలీస్ స్టేషన్లో మహిళపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఇప్పటికే సికింద్రా పోలీసులు విచారణ చేపట్టారు. తన భర్తతో విభేదాలు వచ్చాయని.. ఆ తర్వాత కోర్టులో తన తరపున వాదించడంతో న్యాయవాదితో తనకు పరిచయం ఏర్పడిందని బాధిత మహిళ తెలిపింది. లాక్డౌన్ సమయంలో న్యాయవాది తన ఇంటికి రావడం ప్రారంభించాడని.. ఒక రోజు అతను తన భార్యతో వివాదం ఉందని .. తాను కొన్ని రోజులు ఉండటానికి స్థలం కావాలని తన ఇంటికి వెళ్లాడని బాధిత మహిళ తెలిపింది..
ఆ ఇంట్లో ఉంటూనే సదరు అడ్వకేట్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడంతోపాటు ఈ వీడియోలను అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చని అసభ్యకర వీడియోలు కూడా తీశాడని.. ఇది కాకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అడ్వకేట్ తన నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నాడని, అవి ఇంకా తిరిగి ఇవ్వలేదని మహిళ ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారని డీసీపీ వికాస్ కుమార్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని చట్టపరమైన చర్యలు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయని అధికారి తెలిపారు.