Jammu Kashmir : జమ్మూకశ్మీర్ మరోసారి ఉగ్రవాద హింసతో రక్తమోడింది. కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం సాయుధ ఉగ్రవాదులపై భారత సైన్యం ముమ్మరంగా దాడి చేపట్టింది. ‘ఆపరేషన్ అఖాల్’ పేరుతో జరుగుతున్న ఈ ప్రత్యేక దాడి క్రమంలో జవాన్లు, ఉగ్రవాదులు ఒకరికొకరు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. సైన్యం విడుదల చేసిన వివరాల ప్రకారం, లాన్స్ నాయక్ ప్రీతాపాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్ అనే వీరజవాన్లు ధైర్యంగా పోరాడుతూ ఉగ్రవాదుల బుల్లెట్లకు బలయ్యారు. ఈ ఇద్దరూ చివరి క్షణం వరకు తమ ప్రాణాలకంటే దేశ రక్షణను ముందుకు పెట్టారని, వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదని ఆర్మీ నివేదించింది.
Kantara Actor: కన్నడ పరిశ్రమలో విషాదం.. కాంతార నటుడు కన్నుమూత!
సమాచారం అందుకున్న వెంటనే అదనపు సైనిక దళాలను సంఘటనా స్థలానికి తరలించారు. ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. కుల్గాం అటవీ ప్రాంతం, కొండల మధ్య దాగి ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టే ప్రయత్నంలో దళాలు నిమగ్నమై ఉన్నాయని అధికారులు తెలిపారు. సమీప గ్రామాల్లో భద్రతా బలగాలు కఠిన తనిఖీలు చేపట్టాయి. పౌరుల భద్రత కోసం కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కుల్గాం ప్రాంతంలో గత కొన్నినాళ్లుగా ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో భద్రతా విభాగాలు మరింత అప్రమత్తమయ్యాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, రక్షణ శాఖ అధికారులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వీరజవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడానికి ప్రభుత్వం, సైన్యం కఠిన చర్యలు కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.
Kantara Actor: కన్నడ పరిశ్రమలో విషాదం.. కాంతార నటుడు కన్నుమూత!