Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఇజ్రాయెల్ జెండా

తన ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ జెండాను పెట్టారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గాజాలో యూదులు 40 వేల మందిని ఊచకోత కోశారని, 12 లక్షల మందిని నిరాశ్రయులను చేశారని ఒవైసీ అన్నారు. ఇజ్రాయెల్ యూదు దేశమని, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేశారన్నారు.

Published By: HashtagU Telugu Desk
Asaduddin Owaisi

Asaduddin Owaisi:

Asaduddin Owaisi: తన ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ జెండాను పెట్టారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గాజాలో యూదులు 40 వేల మందిని ఊచకోత కోశారని, 12 లక్షల మందిని నిరాశ్రయులను చేశారని ఒవైసీ అన్నారు. ఇజ్రాయెల్ యూదు దేశమని, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేశారన్నారు. అప్పటి నుండి గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడి వైఖరిని అవలంబిస్తోందని అన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రజలు కొందరు అసదుద్దీన్ ని టార్గెట్ చేశారు. అతనిపై మండిపడుతూ తన ఇంటిని ముట్టడిస్తూ నిరసన తెలిపారు.

పార్లమెంటు కాంప్లెక్స్‌లో అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఢిల్లీ ఇంటిపై దుండగులు సిరా విసిరినట్లు ఆరోపించారు. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా సార్లు జరిగాయన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, స్వయంగా ప్రధానమంత్రి ఇలాంటి వారిని సమూలంగా మార్చినందుకే ఈ విధ్వంస ఘటనలు జరుగుతున్నాయని ఒవైసీ అన్నారు. కాగా ఎంపీగా పార్లమెంటులో అసదుద్దీన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ‘జై పాలస్తీనా’ నినాదాన్ని లేవనెత్తిన తర్వాత ఈ వివాదం తలెత్తింది.

Also Read: Rohit Sharma: మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి షాకిచ్చిన రోహిత్ శ‌ర్మ‌..!

  Last Updated: 28 Jun 2024, 02:48 PM IST