Site icon HashtagU Telugu

Indus Waters Treaty : భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..

International Court of Justice orders India to...

International Court of Justice orders India to...

Indus Waters Treaty : సింధూ నది జలాల వివాదంపై పాకిస్తాన్ ఫిర్యాదుతో స్పందించిన అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ – ICJ) భారతదేశాన్ని సింధూ నది జలాలను విడుదల చేయాలని ఆదేశించిన విషయం తాజా చర్చకు దారితీసింది. అయితే భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తూ, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈ వివాదంపై అధికారం లేదని తేల్చిచెప్పింది. భారత్ ప్రకటన ప్రకారం, సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) 1960లో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పరస్పర అంగీకారంతో రూపొందించబడిన ద్వైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందంపై తగినంత స్పష్టత ఉండగా, దీనిపై తృతీయ పక్షాల హస్తక్షేపానికి ఆస్కారం లేదని భారత్ స్పష్టం చేసింది.

Read Also: China-India : ట్రంప్‌ చర్యలు..భారత్‌-చైనా మధ్య వ్యాపార సంబంధాలు బలపడుతున్నాయా?

అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను తిరస్కరించిన భారత్ఇ ది పూర్తిగా తమ స్వతంత్రాధికార పరిధిలో వచ్చే అంశమని పేర్కొంది. ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా, భారత్ పాకిస్తాన్‌కు సింధూ నది ద్వారా విడుదలవుతున్న జలాలను నియంత్రించడానికి చర్యలు ప్రారంభించింది. పాకిస్తాన్ మళ్లీ మళ్లీ ఈ జలాల విషయాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో భారత్ ఈ విషయంలో తన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటోందని అధికార వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం ప్రకారం పాకిస్తాన్ తీరుతో విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోంది. అటువంటి పరిస్థితుల్లో భారత్‌ నీటి ప్రవాహాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సింధూ జలాల ఒప్పందం ప్రకారం, భారతదేశానికి మూడు నదుల – రవి, బీయాస్, సుట్లెజ్ పూర్తయిన నియంత్రణ ఉన్నప్పటికీ, ఇంద్ర, జెలమ్, చెనాబ్ లాంటి నదులపై పరిమిత అధికారమే ఉంది. అయితే  పాక్ విఫలంగా ప్రవర్తిస్తోందని తెలిపిన భారత్, ఈ ఒప్పందంపై పునరాలోచన అవసరమని భావిస్తోంది అంతర్జాతీయ న్యాయస్థానం జలాల విడుదలపై ఇచ్చిన ఆదేశాలు దేశ సార్వభౌమాధికారానికి విరుద్ధమని, ద్వైపాక్షిక ఒప్పందాల్లో మూడో పార్టీ జోక్యం అంగీకరించదగినది కాదని భారత్ గట్టిగా ప్రకటించింది. ఈ పరిణామం నేపథ్యంలో  భారత్ చర్యలు ప్రస్తుత గెహోపాలిటికల్ పరిస్థితుల్లో సమర్థవంతంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్‌తో భవిష్యత్తులో జరగబోయే చర్చల్లో ఈ జలాల అంశం కీలకంగా మారనుంది.

Read Also: Rohit Sharma: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. రోహిత్ శర్మకి ప్రమోషన్!