Site icon HashtagU Telugu

1st Flight To Ayodhya : ఇండిగో పైలట్ ‘జై శ్రీరామ్’ నినాదం.. అయోధ్యకు బయలుదేరిన తొలి విమానం

1st Flight To Ayodhya1

1st Flight To Ayodhya1

1st Flight To Ayodhya : ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే .. అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి వెళ్లే మొదటి ఇండిగో విమానం శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఇండిగో పైలట్ అశుతోష్ శేఖర్ విమానంలో ఉన్న ప్రయాణికులందరికీ ఈసందర్భంగా స్వాగతం పలికారు. ఆయన ఏమన్నారంటే.. “ఇండిగో నాకు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన విమానానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కల్పించినందుకు గొప్ప అదృష్టవంతుడిని.. మీ ప్రయాణం చక్కగా, సంతోషంగా జరుగుతుందని మేం ఆశిస్తున్నాం. మేం మీకు మరిన్ని అప్‌డేట్‌లను అందిస్తూ ఉంటాం. జై శ్రీరామ్” అని పైలట్ అశుతోష్ శేఖర్ చెప్పారు. ఆ వెంటనే విమానంలో ఉన్న ప్రయాణికులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(1st Flight To Ayodhya) అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

అయోధ్య విమానాశ్రయం విశేషాలు

Also Read: Wall Paint With Sandals : చెప్పులు, చీపుర్లతో వాల్ పెయింటింగ్.. ఇదిగో వీడియో