Site icon HashtagU Telugu

Drone School: దేశంలో ‘ఫ‌స్ట్ డ్రోన్’ స్కూల్ ప్రారంభం!

Drone School

Drone School

గ్వాలియర్‌లో తొలి డ్రోన్ పాఠశాలను గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. డ్రోన్ టెక్నాలజీ యువతకు అపారమైన సాంకేతిక అవకాశాలను కల్పిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. “రాష్ట్రంలో మొదటి డ్రోన్ పాఠశాల గ్వాలియర్‌లో ప్రారంభించబడింది. డ్రోన్‌లను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు కాబట్టి ఈ పరిశ్రమలో భారీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ”అని చౌహాన్ మీడియాతో అన్నారు. అంతేకాకుండా, గతేడాది డిసెంబర్‌లో గ్వాలియర్‌లో డ్రోన్ మెటాను నిర్వహించడం ద్వారా డ్రోన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.

ఈ కార్యక్రమం డ్రోన్ తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, వినియోగదారు సంఘాలు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ డ్రోన్ ఎగ్జిబిష‌న్లు, ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నాయి. “ఈ డ్రోన్ పాఠశాల మధ్యప్రదేశ్ యువతను సాంకేతికతతో అనుసంధానించడం ద్వారా టెక్నాల‌జీప‌రంగా ముందుకు సాగడానికి మార్గం సుగమం చేయడమే కాకుండా, ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది. ఇది గ్వాలియర్‌తో పాటు మధ్యప్రదేశ్ పురోగతిలో మైలురాయి” అని సీఎం చౌహ‌న్‌ ట్వీట్ చేశారు.

Exit mobile version