Site icon HashtagU Telugu

Nimisha Priya: జులై 16న భారత పౌరురాలికి ఉరిశిక్ష.. ఎవ‌రీ నిమిషా?

Nimisha Priya

Nimisha Priya

Nimisha Priya: యెమెన్‌లో జులై 16న భారత పౌరురాలు నిమిషా ప్రియా (Nimisha Priya)కు ఉరిశిక్ష అమలు చేయ‌నున్నారు. దీని కోసం యెమెన్ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అయితే, నిమిషా ప్రియా ప్రాణాలను ఇంకా కాపాడే అవకాశం ఉందని చెప్పబడుతోంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం, నిమిషా తల్లి ప్రేమ కుమారి తన కుమార్తెను రక్షించేందుకు గత సంవత్సరం నుండి యెమెన్‌లోనే ఉంటోంది. ఇప్పుడు నిమిషా ప్రియా ఎవరో తెలుసుకుందాం.

2017లో నిమిషాపై నరహత్య ఆరోపణ

నిమిషా గత కొన్ని సంవత్సరాలుగా యెమెన్‌లో ఉంటూ క్లినిక్ నడుపుతోంది. 2017లో నిమిషాపై తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ నరహత్య ఆరోపణలు రాగా.. అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చాలా సంవత్సరాల పాటు కేసు నడిచిన తర్వాత ఆమెపై ఆరోపణలు నిరూపితమయ్యాయని తెలుస్తోంది. దీని తర్వాత, యెమెన్ చట్టం ప్రకారం కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. జులై 16న నిమిషాకు ఉరిశిక్ష అమలు చేయ‌నున్నారు. దీని కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

నిమిషా ప్రియా ఎవరు?

నిమిషా ప్రియా అసలు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొచ్చి జిల్లాకు చెందినవారు. ఆమె తల్లి ప్రేమ కుమారి కొచ్చిలోనే పనిమనిషిగా పనిచేసేది. నిమిషా 19 సంవత్సరాల వయసులో 2008లో యెమెన్‌కు వెళ్లింది. మూడు సంవత్సరాల తర్వాత నిమిషా తిరిగి వచ్చి.. ఆటో డ్రైవర్ టామీ థామస్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత థామస్ కూడా నిమిషాతో యెమెన్‌కు వెళ్లాడు. ఈ మధ్యలో నిమిషా ఒక కుమార్తెకు తల్లి అయింది. ఆమె కుమార్తె ఇప్పుడు 13 సంవత్సరాలు.

Also Read: BCCI: బీసీసీఐలో ఉద్యోగం సాధించ‌టం ఎలా?

తలాల్ అబ్దో మెహదీ- నిమిషా భాగస్వామ్యంతో కలిసి క్లినిక్‌ను ప్రారంభించారు. తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. యెమెన్ చట్టం ప్రకారం వ్యాపారం కోసం స్థానిక భాగస్వామి ఉండటం తప్పనిసరి. ఈ సమయంలో 2017లో నిమిషాపై తలాల్ నరహత్య ఆరోపణలు రాగా, ఆమెను అరెస్టు చేశారు. నిమిషా ప్రియా ఆరోపిస్తూ.. తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ తన జీవితాన్ని నరకంగా మార్చాడని చెప్పింది. తలాల్ మొదట నిమిషాకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి, ఆమె డాక్యుమెంట్లలో చేయకూడని మార్పులు చేసి ఆమెను తన భార్యగా చూపించాడు. తలాల్ ఆమెను ఆర్థికంగా దోచుకున్నాడని చెప్పింది. ఈ హింస నుండి విసిగిపోయిన నిమిషా.. తలాల్‌ను మత్తులోకి తీసుకెళ్లే ఔషధం ఇచ్చింది. కానీ అధిక మోతాదు కారణంగా అతను మరణించాడు.

రాష్ట్రపతి కూడా ఉరిశిక్షకు ముద్ర వేశారు

ఈ కేసులో యెమెన్ ట్రయల్ కోర్టు నిమిషా ప్రియాకు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. నిమిషా లాయర్ రాష్ట్రపతికి మరణ శిక్షను రద్దు చేయమని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి రషద్-అల్-అలీమీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించి, మరణశిక్షను కొనసాగించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఈ సంవత్సరం జనవరిలో ఇవ్వబడ్డాయి.