Site icon HashtagU Telugu

Indian Family Killed : అమెరికాలో భారతీయ ఫ్యామిలీ హత్య ? దంపతులు, ఇద్దరు కవల పిల్లల మృతి

Indian Family Killed

Indian Family Killed

Indian Family Killed : అమెరికాలో భారతీయుల హత్యలు ఆగడం లేదు. తాజాగా కేరళకు చెందిన ఒక కుటుంబంలోని సభ్యులంతా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వారి ఇంటిలో శవాలై కనిపించారు. చనిపోయిన వారిని ఆనంద్ సుజిత్ హెన్రీ (42), ఆయన భార్య అలిస్ ప్రియాంక (40), వారి 4 సంవత్సరాల కవల పిల్లలు నోహ్, నీతాన్‌లుగా గుర్తించారు. సమీప బంధువులు చేసిన ఫోన్ కాల్స్‌కు ఆనంద్ సుజిత్ హెన్రీ ఫ్యామిలీ ఎంతకూ స్పందించలేదు. దీంతో వారికి సందేహం వచ్చి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి వద్దకు  వెళ్లి చూడగా.. తలుపులు మూసి ఉన్నాయి. ఎంత కొట్టినా తలుపులు తెరవడం లేదు. దీంతో తెరిచి ఉన్న ఒక కిటికీ ద్వారా పోలీసులు లోపలికి ప్రవేశించారు.  ఆ ఇంట్లోని వారంతా శవాలై పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆనంద్, ఆలిస్ ప్రియాంక దంపతులు బాత్రూమ్‌లో తుపాకీ గాయాలతో చనిపోయి పడి ఉన్నారు. కవల పిల్లలు బెడ్‌రూమ్‌లో చనిపోయి పడి ఉన్నారు.

ఏం జరిగింది ?

దంపతులిద్దరూ పిల్లల్ని చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా ? ఎవరైనా ఈ దంపతులను చంపి, పిల్లల్ని కూడా హతమార్చారా ? అనేది విచారణలో(Indian Family Killed) తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రాథమిక విచారణలో సేకరించిన సమాచారం ప్రకారం..  ఆనంద్ సుజిత్ హెన్రీ నివసిస్తున్న ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు దొరకలేదు.బాత్‌రూమ్‌లో 9ఎంఎం పిస్టల్‌, లోడెడ్‌ మ్యాగజైన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అనుమానాస్పద మరణాల కేసును శాన్ మాటియో కౌంటీ యొక్క క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CIB)కు అప్పగించారు. సాన్ మాటియో కౌంటీ క్రైమ్ ల్యాబ్‌తో కలిసి సాక్ష్యాలను సేకరించారు. మృతదేహాలను శాన్ మాటియో కౌంటీ కరోనర్ అదుపులోకి తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : PM Vishwakarma Scheme : చేతివృత్తుల వారికి 3 లక్షల లోన్.. ‘పీఎం విశ్వకర్మ’కు అప్లై చేయండిలా