దేశంలో అంతరించిపోతున్న చీతాల (Cheetahs) సంఖ్య మరింత పెరగనుంది. వందకుపైగా చీతాలను భారత్ (India)కు అందించేందుకు దక్షిణాఫ్రికా (South Africa) ముందుకు వచ్చింది. వచ్చే పదేళ్లలో వీటిని తరలించేందుకు దక్షిణాఫ్రికా ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చిరుతలను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణాఫ్రికా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తెలిపింది. నమీబియా తర్వాత దక్షిణాఫ్రికా నుంచి కూడా చిరుతపులిలను భారత్కు తీసుకురానున్నారు. ఇందుకోసం దక్షిణాఫ్రికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎనిమిది నుంచి పదేళ్ల మధ్య ఒప్పందం ప్రకారం.. ప్రతి సంవత్సరం 12 చిరుతలు భారతదేశానికి వస్తాయి. ఫిబ్రవరిలో భారత్కు 12 చిరుతలు వస్తాయని భావిస్తున్నారు.
భారతదేశం ఒకప్పుడు ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేది. 1952లో చిరుతలు అంతరించిపోయాయని ప్రభుత్వం ప్రకటించింది. దీని తరువాత భారత ప్రభుత్వం 1970లో ఇరాన్ నుండి ఆసియా చిరుతలను తీసుకురావడానికి ప్రయత్నించింది. ఇరాన్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిగాయి కానీ ఈ చర్చలు విజయవంతం కాలేదు. అయితే మోదీ ప్రభుత్వం నమీబియా నుంచి గతేడాది ఎనిమిది చిరుతలను తీసుకొచ్చింది. ఐదేళ్లలో 50 చిరుతలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కునో నేషనల్ పార్క్లో చిరుతపులులను ఉంచడానికి 25 గ్రామాల గ్రామస్థులు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది.
Also Read: Russian Missiles: ఉక్రెయిన్ పై రష్యా మిసైళ్ల వర్షం.. 11 మంది మృతి
గతేడాది ఎనిమిది చిరుతలు భారత్కు వచ్చాయి. వీటిలో ఐదు మహిళ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. వాటి వయస్సు నాలుగు నుండి ఆరు సంవత్సరాలు. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్లో తన 70వ పుట్టిన రోజు సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్క్లోజర్లోకి ఈ చిరుతలను వదిలారు.