భారతీయులపై కెనడాలో వ్యతిరేకత పెరుగుతోంది. భారతీయులకు వ్యతిరేకంగా నేరాల సంఖ్య పెరుగుతోంది. మతపరమైన హింస, రేసిజం, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగినట్టు భారత ప్రభుత్వం గుర్తించింది. అందుకే, కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెబుతోంది.
ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస మరియు భారత వ్యతిరేక కార్యకలాపాలపై కెనడా ప్రభుత్వంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చలు చేపట్టింది. నేరాలపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను అభ్యర్థించారు. భారతీయులపై నేరాలకు పాల్పడినవాళ్లపై కెనడా న్యాయస్థానాల వరకు వెళ్లలేదని అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కెనడాలోని భారతీయ పౌరులు మరియు భారతదేశం నుండి విద్యార్థులు మరియు విద్య కోసం కెనడాకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. భారతీయ పౌరులు మరియు విద్యార్థులు ఒట్టావాలోని భారతీయ మిషన్ లేదా టొరంటో మరియు వాంకోవర్లోని కాన్సులేట్లలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.