Income Tax Day: ఆదాయపు పన్ను శాఖ ప్రతి సంవత్సరం జూలై 24ని ‘ఆయకార్ దివస్’గా జరుపుకుంటుంది. భారతదేశంలో ఆదాయపు పన్ను నిబంధనల అమలు సందర్భంగా ఇది జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డే (Income Tax Day)ను జరుపుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ చాలా సన్నాహాలు చేసి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది 164వ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఈ మేరకు దేశంలోని దాదాపు ప్రతి అధికారిక భాషలో ఆదాయపు పన్ను శాఖ @IncomeTaxIndia ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్లు చేయబడుతున్నాయి. ఈ ట్వీట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాండిల్ నుండి కూడా రీట్వీట్ చేయబడుతున్నాయి. ఇది కాకుండా, 164 వ ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల PIB ట్విట్టర్ హ్యాండిల్స్ నుండి నిరంతర ట్వీట్లు పోస్ట్ చేయబడుతున్నాయి.
ఇవాళ ఆర్థిక మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు
164వ ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ ద్వారా ఈ సమాచారం అందించబడింది.
Also Read: Siddipet : మురికి కాలువలో స్వయంగా చెత్తను తొలగించిన మంత్రి హరీశ్ రావు
ఆదాయపు పన్ను దినోత్సవం చరిత్ర ఏమిటి..?
24 జూలై 1860న సర్ జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొదటిసారిగా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు. మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు జేమ్స్ విల్సన్ 1857లో భారతదేశంలో ఈ పన్నును అమలు చేశాడు. దేశంలో మొదటిసారిగా 24 జూలై 2020న ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారతదేశంలో ఆదాయపు పన్ను ఆవిర్భవించిన 150 సంవత్సరాల జ్ఞాపకార్థం జరుపుకున్నారు.
ఆదాయపు పన్ను శాఖ గురించి తెలుసుకోండి
ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్ను వసూలు చేసే విభాగం. ఇది రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అనే అపెక్స్ బాడీ ద్వారా నిర్వహించబడుతుంది.