Independence Day 2024: నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ

నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ల ప్రభావిత బస్తర్ ప్రాంతంలో తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను జరపనున్నారు.ప్రస్తుతం ఆ ప్రదేశం భద్రత దళాల మధ్య ఉంది. గతేడాది గణతంత్ర దినోత్సవం తర్వాత ఈ ప్రదేశాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Independence Day 2024

Independence Day 2024

Independence Day 2024: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ల ప్రభావిత బస్తర్ ప్రాంతంలో ఉన్న 13 మారుమూల గ్రామాల్లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడు నెలల్లో ఈ గ్రామాల్లో భద్రతా బలగాల కొత్త క్యాంపులను ఏర్పాటు చేయడం ఆయా ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు.

నెర్‌ఘాట్ (దంతెవాడ జిల్లా), పనిదోబిర్ (కంకేర్), గుండం, పుట్‌కేల్ మరియు చుత్వాహి (బీజాపూర్), కస్తూర్‌మెట, మస్పూర్, ఇరాక్‌భట్టి మరియు మొహంది (నారాయణపూర్), టేకల్‌గూడెం, పువర్తి, లఖపాల్ మరియు పులన్‌పాడ్ (సుక్మా) గ్రామాల్లో గురువారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎన్నడూ జరగలేదని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ తెలిపారు.

గతేడాది గణతంత్ర దినోత్సవం తర్వాత ఈ ప్రదేశాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు, ప్రధానంగా గిరిజనులకు చేరవేసేందుకు, ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని తెలిపారు. ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్ గత మూడు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద ముప్పుతో పోరాడుతోంది. కాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రాయ్‌పూర్‌తో సహా అన్ని జిల్లాల్లో సన్నాహాలు పూర్తి చేసిందని ప్రభుత్వ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.

రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ మైదానంలో ఉదయం ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి జాతీయ జెండాను ఎగురవేసి, వివిధ యూనిట్ల భద్రతా సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో బిలాస్‌పూర్‌లో, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ జగ్దల్‌పూర్ లో, కేంద్ర సహాయ మంత్రి తోఖాన్ సాహు మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లాలో జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రత్యేకించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Rythu Runa Mafi: ఆగస్టు 15న మూడో విడత రుణ మాఫీ..!

  Last Updated: 14 Aug 2024, 10:27 PM IST