Encounter : కాంకేర్‌ జిల్లాలో భారీ ఎన్​కౌంటర్..18మంది మావోయిస్టులు హతం..!

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 06:00 PM IST

Encounter: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్ఘడ్ రాష్ట్రం(Chhattisgarh State) కాంకేర్‌ జిల్లా(Kanker District)లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. మరోవైపు.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్ల సంఖ్యను నిర్ధారించలేదు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఎస్పీ ఇంద్రకళ్యాణ్ ఐలెసెల ధృవీకరించారు. కాగా.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికీ కాంకేర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

Read Also: Srileela – Rashi Khanna : శ్రీలీల ఎగ్జిట్ రాశి ఖన్నా ఎంటర్.. క్రేజీ ప్రాజెక్ట్ లో లక్కీ ఛాన్స్..!