Asaduddin Owaisi : హిజాబ్ ధరించిన అమ్మాయి…ఏదొక రోజు భారత ప్రధాని అవుతుంది. !!

బ్రిటన్ లో భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధానమంత్రి కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 04:04 AM IST

బ్రిటన్ లో భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధానమంత్రి కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా కూడా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదొక రోజు హిజాబ్ ధరించిన అమ్మాయి. భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుందని వ్యాఖ్యానించారు. కర్నాటకలోని బిజ్ పూర్ లో..మీడియాతో మాట్లాడారు ఓవైసీ. శశిథరూర్ చేసిన ట్వీట్ పై మీడియా ఓవైసీని స్పందించమని మీడియా కోరింది. దీనికి ఓవైసీ ఇలా అన్నారు. హిజాబ్ ధరించిన అమ్మాయి భారత ప్రధాని అవుతుందని నేను ఇప్పటికే చెప్పాను అని అన్నారు.

శశిథరూర్ ఏమని ట్వీట్ చేశారంటే…బ్రిటిషన్లు ప్రపంచంలో చాలా అరుదైనర పనిని చేశారని…మైనార్టీ కమ్యూనటీకి చెందిన ఒక సభ్యునికి వారి అత్యంత శక్తివంతమైన కార్యాలయంలో అవకాశం కల్పించారని మనందరం అంగీకరించాలని భావిస్తున్నాను. మేము భారత్ లో రుషిసునక్ కోసం సంబురాలు జరుపుకుంటున్నాం. మరి ఇది భారత్ లో సాధ్యం అవుతుందా అని ప్రశ్నిస్తూ శశిథరూర్ ట్వీట్ చేశారు.

కాగా అంతకుముందు ముస్లింలను దేశం నుంచి దూరము చేయడమే బీజేపీ ధ్యేయమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హలాల్ మాంసం వల్ల దేశానికి ముప్పు,ముస్లిం గడ్డానికి ముప్పు,ముస్లింటోపి పెడితే ముప్పు,ముస్లిం తిండి,పానీయం ,దుస్తులు, బంగారం అన్నీ ప్రమాదకరమే అన్నారు. ముస్లింల గుర్తింపుకు బీజేపీ వ్యతిరేకం అన్నారు. ముస్లింలను బహిష్కరించాలని ఓ ఎంపీ చెప్పారన్నారు. ఇదే బీజేపీ ఎజెండా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల గుర్తింపును శాశ్వతంగా నాశనం చేయండి. ప్రధాని నరేంద్రమోదీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటారని..అయితే అది నోటి మాట మాత్రమేనన్నారు. దేశ వైవిద్యాన్ని, ముస్లిం గుర్తింపును నాశనం చేడయమే బీజేపీ అసలు ఎజెండా అంటూ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.