10th Fail: దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో నాణ్యత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. పదో తరగతి (Class 10), ఇంటర్మీడియట్ (Class 12) పరీక్షల్లో అధిక విఫల రేటు ఉన్న ఏడు రాష్ట్రాలు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, కేరళ, మణిపుర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. 2023లో ఈ రాష్ట్రాల్లో విద్యార్థుల ఫెయిల్ రేటు సగటున 66 శాతంగా ఉండటం కేంద్రాన్ని ఆందోళనకు గురిచేసింది.
కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 66 పాఠశాల పరీక్షా బోర్డులు ఉన్నాయి. వీటిలో 3 జాతీయ స్థాయిలో ఉండగా, మిగతా 63 రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి (54 రెగ్యులర్, 12 ఓపెన్ బోర్డులు). టాప్ 33 బోర్డులు దేశంలోని 97 శాతం విద్యార్థులను కవర్ చేస్తున్నప్పటికీ, మిగిలిన 33 బోర్డులు కేవలం 3 శాతం విద్యార్థులకు మాత్రమే సేవలు అందిస్తున్నాయి.
2024లో 10వ తరగతిలో 22.17 లక్షల మంది విద్యార్థులు, 12వ తరగతిలో 20.16 లక్షల మంది విద్యార్థులు ఫెయిలైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది గతంతో పోలిస్తే కొంత మెరుగవుతున్నప్పటికీ, ఫెయిల్యూర్ రేటు ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉందని అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఓపెన్ స్కూల్ బోర్డుల్లో విద్యార్థుల విజయ శాతం అత్యల్పంగా ఉంది. 10వ తరగతిలో కేవలం 54 శాతం, 12వ తరగతిలో 57 శాతం విద్యార్థులే ఉత్తీర్ణత సాధించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) తన సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచించింది.
ఇటీవలగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో NIOS బలోపేతం కావడమే దానికి కారణమని తెలిపారు. అదే తరహాలో ఫెయిల్యూర్ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమలులోకి తీసుకురావాలని సూచించారు.
Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టుల లొంగుబాటు