Ujjwala Scheme: గుడ్ న్యూస్‌.. ఉజ్వల పథకం గ్యాస్‌ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు

ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ( Ujjwala Scheme) కింద LPG సిలిండర్‌లను ఉపయోగిస్తున్న ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పీజీ సిలిండర్‌పై ప్రభుత్వం రూ.300 సబ్సిడీని ఏడాదికి పెంచింది

Ujjwala Scheme: ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ( Ujjwala Scheme) కింద LPG సిలిండర్‌లను ఉపయోగిస్తున్న ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పీజీ సిలిండర్‌పై ప్రభుత్వం రూ.300 సబ్సిడీని ఏడాదికి పెంచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని 9 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందనున్నారు. మార్చి 7న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సబ్సిడీని ఒక సంవత్సరం పాటు అంటే 31 మార్చి 2025 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎన్నికల వేళ పేద, మధ్య తరగతి వర్గాలకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వ‌ల యోజ‌న కింద గ్యాస్ సిలిండ‌ర్‌పై అందిస్తున్న రూ.300 స‌బ్సిడీని ఏప్రిల్ నుంచి మ‌రో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం సిలిండ‌ర్ ధ‌ర రూ. 955 ఉండ‌గా.. ఈ స్కీమ్ కింద రూ. 300 సబ్సిడీ పోనూ.. రూ. 655కే సిలిండ‌ర్ అందిస్తున్నారు. మ‌రో ఏడాది రాయితీతో ప్ర‌భుత్వంపై రూ. 12వేల కోట్ల భారం ప‌డుతుంద‌ని ఆర్థిక నిపుణుల అంచ‌నా.

ఈ పథకం కింద లబ్ధిదారులు మార్చి 31, 2025 వరకు సబ్సిడీ పొందుతారు. సబ్సిడీని ఒక సంవత్సరం పొడిగించడం వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్ల భారం పడవచ్చు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.300 సబ్సిడీ ఇస్తుందని మ‌న‌కు తెలిసిందే. ఈ సబ్సిడీ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.603గా ఉంది. అదే సమయంలో ఢిల్లీలో సాధారణ వినియోగదారులకు సిలిండర్ ధర రూ.903.

గతంలో సబ్సిడీ రూ.200 ఉండేది

గతేడాది వరకు ఈ పథకం కింద లబ్ధిదారులు రూ.200 సబ్సిడీ పొందేవారు. అయితే అక్టోబర్ 2023లో సబ్సిడీ మొత్తాన్ని రూ.100 పెంచి రూ.300కి పెంచారు. భారత ప్రభుత్వం ప్రస్తుతం సంవత్సరానికి 12 రీఫిల్స్‌పై లబ్ధిదారులకు ఈ సబ్సిడీని ఇస్తుంది.

గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం 14.2 కిలోల సిలిండర్‌పై ఏడాదికి 12 రీఫిల్‌ల వరకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఉంది. ఈ సబ్సిడీని 2024-25 వరకు పొడిగించాలని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఇప్పుడు నిర్ణయించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

Also Read: International Women’s Day 2024 : ఈ వయసులు దాటిన మహిళలు ఆ టెస్టులు చేయించుకోవాల్సిందే..