Dawood Properties : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనవరి 5న దావూద్ ఆస్తులను వేలం వేయనున్నారు. మహారాష్ట్రలోని ముంబై, రత్నగిరి ఏరియాల పరిధిలో దావూద్ పేరిట ఉన్న పలు స్థిరాస్తులను విదేశీ మారక ద్రవ్య చట్టం (సఫ్మా) కింద అధికారులు సీజ్ చేశారు. రత్నగిరి పరిధిలోని ఖేడ్ తాలూకాలో ఉన్న బంగ్లాలు, మామిడి తోటలు సహా నాలుగు ఆస్తులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వాటన్నింటిని వచ్చే నెల 5వ తారీఖున వేలం వేస్తారు.దావూద్ ఆస్తులను వేలం వేయడం ఇదే తొలిసారేం కాదు. గతంలో దావూద్ సంబంధీకులకు చెందిన ఓ రెస్టారెంట్ను రూ.4.53 కోట్లకు, ఆరు ఫ్లాట్లను రూ.3.53 కోట్లకు, ఒక గెస్ట్ హౌస్ను రూ.3.52 కోట్లకు కేంద్ర సర్కారు వేలం వేసింది. చివరిసారిగా 2020 డిసెంబరులో రత్నగిరిలోని దావూద్ ఆస్తులను వేలం వేయగా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.10 కోట్లు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join.
- 2015 మే నాటికే దావూద్ ఇబ్రహీంకు దాదాపు రూ.55వేల కోట్ల నికర సంపద(Dawood Properties) ఉందని అంచనా వేయబడింది.
- దావుద్ ఇబ్రహీంకు ఐదు ఖండాలలోని 16 దేశాలలో ఆస్తులు ఉన్నాయని అంటారు.
- రియల్ ఎస్టేట్ మార్కెట్లో దావుద్ ఇబ్రహీం భారీగా పెట్టుబడులు పెట్టాడని చెబుతారు.
- దావూద్ ఇబ్రహీంకు ఇంగ్లండ్లోని వార్విక్షైర్లో ఒక హోటల్, ఇంగ్లండ్లోని మిడ్లాండ్స్లోని ఇతర స్థిరాస్తులు ఉన్నాయని అంచనా.
- లండన్లోని సెయింట్ జాన్స్ వుడ్ రోడ్లో దావూద్కు పెద్ద గ్యారేజీ ఉందని సమాచారం.
- దుబాయ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, మొరాకో, టర్కీలలో కూడా దావూద్ ఆస్తులు ఉన్నాయని అంటారు.
Also Read: 3 Step Plan : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ముగించడానికి 3 దశల ప్లాన్
మరోవైపు పాకిస్తాన్లో దావూద్పై విష ప్రయోగం జరిగిందనే వార్తలు వినవస్తున్నాయి. అయితే వాటిని దావుద్ సన్నిహితుడు చోటా షకీల్ కొట్టిపారేశాడు. అండర్ వరల్డ్ డాన్ బతికే ఉన్నాడని ప్రకటించాడు. 1993లో ముంబై నగరంలో 250 మందిని పొట్టనబెట్టుకుని ముంబై పేలుళ్లకు సూత్రధారి దావూద్ ఇబ్రహీమే. పాకిస్తాన్లో ఉంటున్న దావూద్.. మాహె జబీన్ అనే పాకిస్తానీ పఠాన్ తెగకు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పటికీ అతడు తమ దేశంలోనే లేడని పాకిస్తాన్ వాదిస్తోంది.