Paid Holiday To Workers: ఢిల్లీలో జీ20 సదస్సు ఎఫెక్ట్.. జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశం

ఢిల్లీలోని అన్ని దుకాణాలు, వ్యాపారాలు, వ్యాపార సంస్థల ఉద్యోగులు, కార్మికులకు జీతంతో పాటు సెలవు ఇవ్వాలని (Paid Holiday To Workers) ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 09:59 AM IST

Paid Holiday To Workers: ఢిల్లీలోని అన్ని దుకాణాలు, వ్యాపారాలు, వ్యాపార సంస్థల ఉద్యోగులు, కార్మికులకు జీతంతో పాటు సెలవు ఇవ్వాలని (Paid Holiday To Workers) ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. జీ20 సదస్సు సందర్భంగా ఉద్యోగులకు సెలవు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ రాజధానిలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న జి20 నేతల శిఖరాగ్ర సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 8,9, 10 తేదీలను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. న్యూఢిల్లీలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వాణిజ్య సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం గత వారం ప్రకటించింది.

దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేత

నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని న్యూఢిల్లీ జిల్లాలో ఉన్న దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులందరూ తమ దుకాణాలు, సంస్థలను సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 10 వరకు మూసివేస్తారని, వారి ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను కూడా ఇస్తారని ప్రభుత్వం తెలిపింది.

Also Read: Raksha Bandhan – Holy Stories : రాఖీ శక్తి తెలియాలంటే.. ఈ పురాణ కథలు తెలుసుకోండి

పూర్తి సన్నద్ధత

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జి-20 సదస్సుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. విదేశీ అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, న్యూఢిల్లీలో పబ్లిక్ వాహనాలు, ప్రైవేట్ వాహనాలు, టాక్సీ-క్యాబ్‌లు, విమానాల ప్రవేశాన్ని కూడా రద్దు చేశారు.

30 మెట్రో స్టేషన్లు కొన్ని గంటలపాటు మూతపడనున్నాయి

సెప్టెంబర్ 8,9, 10 తేదీల్లో ప్రతిరోజూ జరిగే VVIP కదలికల దృష్ట్యా మెట్రో 30 స్టేషన్లు కొన్ని గంటల పాటు మూసివేయబడతాయి. దీనితో పాటు అదనపు పారా మిలటరీ బలగాలను కూడా మోహరిస్తారు. స్టేషన్‌ను మూసివేయడం వల్ల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రవేశం, నిష్క్రమణ మాత్రమే నిషేధించబడుతుంది. దీంతో పాటు పార్కింగ్‌ దృష్ట్యా 80 విమానాలను రద్దు చేయాలని నిర్ణయించారు. జీ20 సదస్సులో 29 దేశాల అధినేతలు, ఐరోపా దేశాల అధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొనే అవకాశం ఉండటం గమనార్హం. దీంతోపాటు అతిథి దేశాలను కూడా ఆహ్వానించారు.