Gautam Adani: దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా..?

గౌతమ్ అదానీ దేశంలో అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Adani-Hindenburg Case

Adani Imresizer

గౌతమ్ అదానీ దేశంలో అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన జాబితాలో ముఖేష్ అంబానీ రెండో స్థానంలో ఉన్నాడు. అదానీ సంపద 150 బిలియన్ డాలర్లు కాగా.. అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లుగా ఉంది. 2013 నుంచి అంబానీ దేశంలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతుండగా ఈ ఏడాది అదానీ ఆయనను అధిగమించారు. ఇక.. భారత్ UKను అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది.

లిస్టెడ్ కంపెనీల స్టాక్ ధరలలో అపూర్వమైన ర్యాలీ తరువాత అదానీ సంపద గత కొన్ని సంవత్సరాలలో అనేక రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ తన సంపదకు 5.5 బిలియన్లను జోడించి 2022లో దాని నికర విలువ 90.7 బిలియన్లకు చేర్చారు. అదానీ, అతని కుటుంబం తన 60వ పుట్టినరోజును పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థకు రూ. 60,000 కోట్లను విరాళంగా అందజేస్తానని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.

రాధాకిసన్ దమానీ నికర విలువ 27.6 బిలియన్లు జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. 21.5 బిలియన్ డాలర్లతో సైరస్ పూనావల్లా 2022 ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది సంపన్నుల జాబితాలో నాల్గవ స్థానాన్ని ఆక్రమించారు. శివ నాడార్ ($16.4), సావిత్రి జిందాల్ ($16.4), దిలీప్ షాంఘ్వీ ($15.5), హిందూజా సోదరులు ($15.2), కుమార్ బిర్లా ($15), బజాజ్ కుటుంబం ($14.6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారతదేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 800 బిలియన్ డాలర్లుగా ఉంది. అదానీ, అంబానీల మొత్తం సంపద జాబితాలో 30% ఉంది.

  Last Updated: 20 Oct 2022, 03:00 PM IST