Gang Rape : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం…నిందితుల ఇళ్లు కూల్చివేసిన అధికారులు..!!

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురులు సహా నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

  • Written By:
  • Updated On - September 19, 2022 / 12:03 PM IST

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురులు సహా నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిని ముగ్గురు నిందితుల ఇళ్లను జిల్లా యంత్రాంగం కూల్చివేసింది. మరో ముగ్గురి ఇళ్లు కూడా కూల్చివేస్తామని అధికారులు తెలిపారు. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి గుడికి వెళ్లింది. ఆలయం ప్రాంగణంలో కూర్చున్న బాలికను ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. బాలిక స్నేహితుడు రక్షించమని ఎంత వేడుకున్నా నిందితులు కనికరం చూపలేదు.

బాలికపై అత్యాచారం చేసిన అనంతరం ఆమెను ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టి..మొబైల్, బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపిస్తామని బెదిరించినట్లు తెలిపారు. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు…ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రేవా జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న నైగర్హి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.