G20 Summit: రేపటి నుంచి జీ20 సదస్సు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో అతిథులకు వసతి, భద్రత కోసం 1.30 లక్షల మంది సైనికులు

సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జరగనున్న జీ20 సదస్సు (G20 Summit)కు హాజరయ్యే విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 09:21 AM IST

G20 Summit: సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జరగనున్న జీ20 సదస్సు (G20 Summit)కు హాజరయ్యే విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అతిథులకు ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా లక్షల మంది సైనికులను భద్రత కోసం మోహరించారు. నేటి నుండి అతిథులు రావడం ప్రారంభమవుతుంది. ఈ సదస్సులో పలు ద్వైపాక్షిక చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. G20లో ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల అగ్రనేతలు ప్రధాన ప్రపంచ, ఆర్థిక, భౌగోళిక రాజకీయ సమస్యలపై చర్చలు జరుపుతారు.

ఫైవ్ స్టార్ హోటళ్లలో అతిథులకు వసతి

విదేశీ అతిథులకు ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ITC మౌర్య, తాజ్ మాన్సింగ్, తాజ్ ప్యాలెస్, హోటల్ ఒబెరాయ్, హోటల్ లలిత్, ది లోధి, లే మెరిడియన్, హయత్ రీజెన్సీ, షాంగ్రి-లా, ది లీలా ప్యాలెస్, హోటల్ అశోకా, ఈరోస్ హోటల్, ది సూర్య, రాడిసన్ బ్లూ ప్లాజా, JW మారియట్, షెరటన్, లీలా యాంబియన్స్ కన్వెన్షన్, హోటల్ పుల్‌మాన్, రోసెట్ హోటల్,ది ఇంపీరియల్‌లోని రూములు, సూట్‌లు బుక్ చేయబడ్డాయి.

అతిథుల ఆహారం కోసం సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తితో ప్రత్యేక వెండి పాత్రలు ఏర్పాటు చేశారు. జైపూర్‌కు చెందిన మెటల్‌వేర్ సంస్థ ఈ సందర్భంగా 200 మంది కళాకారులు 15,000 వెండి వస్తువులను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీనితో పాటు దేశంలోని ప్రత్యేక ఆహారాన్ని అతిథులకు అందించనున్నారు. మొఘలాయ్, సౌత్ ఇండియన్ ఫుడ్, చాట్, దేశంలోని ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ కూడా మెనూలో చేర్చబడ్డాయి.

Also Read: PM Modi Host Dinner: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు ప్రధాని మోదీ ప్రత్యేక విందు..!

1.30 లక్షల మంది సైనికులు భద్రత

విదేశీ అతిథుల భద్రత కోసం లక్షా 30 వేల మంది సైనికులను మోహరించేందుకు ఏర్పాట్లు చేశారు. అతిథులు బస చేసే హోటళ్లలో గట్టి భద్రత ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీకి వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఈ సమయంలో చాలా వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించలేవు. మందులు కాకుండా, మిగిలిన డెలివరీ సేవలు మూసివేయబడతాయి. ఒక్క ఢిల్లీలోనే 50 వేల మంది సైనికులు, కే9 డాగ్ స్క్వాడ్‌ను మోహరించనున్నారు. దీంతో పాటు డ్రోన్‌ల ద్వారా కూడా సదస్సును పర్యవేక్షించనున్నారు.

సదస్సు వేదిక కోసం ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు?

సెప్టెంబరు 9-10 తేదీల్లో ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన భారత్‌ మండపంలో రెండు రోజుల సదస్సు జరగనుంది. భారతదేశం గొప్ప వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా భారత్ మండపం రూపొందించబడింది. కాశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని భదోహి తివాచీలు, జాతీయ పక్షి నెమలి ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న కళాఖండాలు భారత్ మండపంలో ఏర్పాటు చేయబడ్డాయి.