దేశచరిత్రలోనే తొలిసారిగా సీఆర్పీఎఫ్ లో ఇద్దరు మహిళా అధికారులకు ఐజీలుగా పదోన్నతులు అందించింది. ఈ ఇద్దరు మహిళా అధికారులు బీహార్ సెక్టార్, ఆర్ఏఎఫ్ కు నాయకత్వం వహించనున్నారు. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళం సీఆర్పీఎఫ్కు చెందిన ఈ ఇద్దరు మహిళాల అదికారులు తొలిసారిగా ఐజీ పదోన్నతి పొందారు. వీరిలో సీమా ధుండియా సీఆర్పీఎఫ్ బీహార్ సెక్టార్ ఐజీగా నియమితులయ్యారు. మరొకరిని ఆర్ఏఎఫ్ కు అధిపతిగా నియమించింది. మహిళా బెటాయలియన్ ఏర్పాటు చేసిన 35 సంవత్సరాల్లో ఇలా ఇద్దరు మహిళా అధికారులు ఈ స్థాయికి ఎదగడం ఇదే తొలిసారి. ఐజీ అబ్రహం 1992లో స్థాపించిన సీఆర్పీఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచారు.
సీమా ధుండియా దేశవ్యాప్తంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో దేశానికి తన విలువైన సేవలను అందించనున్నారు. 1987లో మొదటిసారిగా ఈ మహిళా అధికారులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో చేర్చారు. ఇప్పుడు ప్రమోషన్లో భాగంగా మొదటి బ్యాచ్ పొందారు. లైబీరియాలోని ఐక్యరాజ్యసమితి మిషన్లో మహిళా FPUకి నాయకత్వం వహించడంతో పాటు, అన్నీ అబ్రహంస్ ఫోర్స్ హెడ్క్వార్టర్స్, DIG ఆపరేషన్స్, DIG CR, కాశ్మీర్ ఆపరేషన్స్ సెక్టార్లో విజిలెన్స్లో DIGగా కూడా పనిచేశారు. ఇద్దరు అధికారులు విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పోలీసు పతకం, ప్రతిభావంతమైన సేవ కోసం పోలీసు పతకం, అతి ఉత్కృష్ట్ సేవా పతకాలతో పాటు అనేక ఇతర జాతీయ, అంతర్జాతీయ గౌరవాలతో సత్కరించారు.
For the first time in 35 years two Women cadre officer of #CRPF appointed IG.#AnnieAbraham appointed IG of RAF.#SeemaDhundiya appointed IG of Bihar sector. pic.twitter.com/t8FSsCzJ1d
— IANS (@ians_india) November 2, 2022
1986లో దేశంలోనే తొలిసారిగా మహిళా బెటాలియన్ను పెంచిన ఘనత సీఆర్పీఎఫ్కు ఉందని, మహిళా యోధులకు సాధికారత కల్పించిన చరిత్ర సీఆర్పీఎఫ్కు ఉందని ఓ అధికారి తెలిపారు. సీమా ధుండియా, అన్నీ అబ్రహం ఇద్దరూ మహిళా అధికారుల మొదటి బ్యాచ్లో (1987) నియమించారు.