Site icon HashtagU Telugu

Bharatiya Antariksh Station: చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టిన ఇస్రో.. తొలి చిత్రం ఇదే!

Bharatiya Antariksh Station

Bharatiya Antariksh Station

Bharatiya Antariksh Station: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం (ఆగస్టు 22, 2025) న్యూఢిల్లీలో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల సందర్భంగా భారత అంతరిక్ష కేంద్రం (Bharatiya Antariksh Station) మాడ్యూల్ నమూనాను ఆవిష్కరించింది. భారత ప్రణాళికల ప్రకారం.. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్‌ను 2028 నాటికి కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఘనతతో అంతరిక్ష కేంద్రాలను నడుపుతున్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరనుంది.

2035 నాటికి ఐదు మాడ్యూళ్లు

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS), చైనాకు చెందిన టియాన్‌గాంగ్ అంతరిక్ష కేంద్రం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తమ అంతరిక్ష రంగ లక్ష్యాల ప్రకారం.. భారత్ 2035 నాటికి మొత్తం ఐదు మాడ్యూళ్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తోంది.

Also Read: Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య ఆసక్తికరమైన పోరు!

BAS-01 మాడ్యూల్ విశేషాలు

పరిశోధనలకు వేదిక

ఈ అంతరిక్ష కేంద్రం అంతరిక్షం, జీవ శాస్త్రం, వైద్యం, గ్రహాంతర అన్వేషణ వంటి పలు అంశాలపై పరిశోధనలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. దీనితో మైక్రోగ్రావిటీ మానవ ఆరోగ్యంపై చూపే ప్రభావాలను అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా అంతరిక్షంలో ఎక్కువ కాలం మనుషుల ఉనికికి అవసరమైన సాంకేతికతలను పరీక్షించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది.

అంతరిక్ష పర్యాటకానికి ప్రోత్సాహం

ఈ అంతరిక్ష కేంద్రం అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు వాణిజ్య అంతరిక్ష రంగంలోకి భారత్ ప్రవేశించడానికి కూడా తోడ్పడుతుంది. BAS అంతర్జాతీయ సహకారానికి దోహదం చేసి, శాస్త్రీయ పరిశోధనలకు ఒక కేంద్రంగా పని చేస్తుంది. యువత అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికతలో తమ కెరీర్‌ను ఎంచుకోవడానికి స్ఫూర్తినిస్తుంది. జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలలో భాగంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన 3.8 మీటర్లు x 8 మీటర్ల భారీ BAS-01 నమూనా అందరినీ ఆకట్టుకుంది.