FIR Against Congress: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లి హీరాబెన్కు సంబంధించిన ఒక AI వీడియోను బిహార్ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంపై తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్, కాంగ్రెస్ ఐటీ సెల్పై (FIR Against Congress) కేసు నమోదు చేశారు. ఈ వీడియోను సెప్టెంబర్ 10, 2025న ఎక్స్లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ చేశారు.
ఢిల్లీ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు
ఢిల్లీ బీజేపీ ఎన్నికల సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు ప్రకారం.. ఈ AI-జనరేటెడ్ నకిలీ వీడియోలో ప్రధాని మోదీ, ఆయన తల్లి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వారిని వక్రీకరించి చూపించారు. ఈ వీడియో ప్రధానిని, ఆయన తల్లిని అపహాస్యం చేయడమే కాకుండా మహిళా గౌరవాన్ని, మాతృత్వాన్ని కూడా తీవ్రంగా అవమానించిందని బీజేపీ ఆరోపించింది.
Also Read: Tollywood Bold Beauty: రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ!
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత- 2023లోని కఠినమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీటిలో 18(2), 336(3), 336(4), 340(2), 352, 356(2), 61(2) వంటి సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్లు ప్రధానంగా పరువు నష్టం, వక్రీకరణ, అశ్లీలత, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి నేరాలకు సంబంధించినవి.
గతంలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు
ఈ వీడియో వివాదంతో పాటు ఆగస్టు 27-28 తేదీల్లో బిహార్లోని దర్భంగాలో జరిగిన కాంగ్రెస్-ఆర్జేడీ ఓటర్ అధికార యాత్రలో కూడా ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనలన్నింటినీ పోలీసులు తీవ్రంగా పరిగణించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.