Road Accident : ముంబై -పూణె ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం. 5గురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు..!

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 10:00 AM IST

ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వే పై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారు జామున కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖోపొలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మ్రుతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని అంటున్నారు అధికారులు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్లక్ష్యం వాహనం నడిపించినందుకు ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. యాక్టివాపై వెళ్లుతున్న ఇద్దరు యువకులు సిగరేట్ తాగుతూ నడిపించాడు. స్కూటీ బ్యాలెన్స్ తప్పడంతో డివైడర్ ను డీ కొటింది. ఈప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. ఈ రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 45ఏళ్ల వయస్సున్న వారే ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నారని పోలీసులు తెలిపారు.