Republic Day Celebration: ఈసారి రిపబ్లిక్‌ డే చీఫ్‌ గెస్ట్‌ ఎవరో తెలుసా..?

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు

Published By: HashtagU Telugu Desk
2262071 Egyptpresidentafpd

2262071 Egyptpresidentafpd

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్ అల్-సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఇదే తొలిసారి. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈజిప్ట్ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని అందజేశారు. జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. ఇదే మొదటిసారి మన గణతంత్ర దినోత్సవానికి అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం అని పేర్కొన్నారు. వాస్తవానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే (రిపబ్లిక్ డే 2023) సందర్భంగా ఇతర దేశాల పెద్ద నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగలేదు. అటువంటి పరిస్థితిలో కరోనా వైరస్ వినాశనం తగ్గిన తరువాత 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసిని ఆహ్వానించాలని భారతదేశం నిర్ణయించింది. భారతదేశం ఈజిప్టుతో సుదీర్ఘ రాజకీయ, సైనిక సంబంధాలను కలిగి ఉంది. ఈ ఏడాది రెండు దేశాలు దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి.

 

 

 

  Last Updated: 27 Nov 2022, 04:07 PM IST