Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో ఈడీ విచారణపై లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మా నాన్నకు ఏదైనా జరిగితే సీబీఐ-ఈడీ, వాటి యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి. నాన్న పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు అని చెప్పిన ఆమె తన తండ్రిని సింహంతో పోల్చారు.
లాలూ యాదవ్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడితో పాటు అప్పటి రైల్వే జనరల్ మేనేజర్ పేరును కూడా చార్జిషీటులో చేర్చారు. రైల్వేలో నియామకాలు పొందినందుకు ప్రతిఫలంగా, లాలూ ప్రసాద్ యాదవ్ అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యుల భూములను తన భార్య రబ్రీ దేవి మరియు కుమార్తె మిసా భారతి పేరు మీద బదిలీ చేశారని ఆరోపించారు.
ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, ఆమె కుమార్తె మిసా భారతితో పాటు మరో 13 మందిపై సీబీఐ గతేడాది అక్టోబర్లో చార్జ్ షీట్ దాఖలు చేసింది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. అదే సమయంలో మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Also Read: Whatsapp: వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. బ్యాకప్ చేయకుండానే డేటా ట్రాన్స్ఫర్!