PM Modis Speech : రాజస్థాన్లోని బన్స్వారా సభలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ప్రధాని ప్రసంగంలోని వివాదాస్పద అంశాలపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్, సీపీఎం చేసిన ఫిర్యాదులను పరిశీలించే ప్రక్రియను ఈసీ షురూ చేసింది. ఈవిషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join
‘‘దేశంలోని ఓ మైనారిటీ వర్గానికే దేశపు ఆస్తులపై తొలి హక్కు ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా ఏళ్లక్రితమే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లిం సమాజానికి వనరులను కేటాయించేందుకు ప్రాధాన్యత ఇస్తాయి’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మెజారిటీ వర్గం నుంచి నిధులను లాక్కొని ఓ మైనారిటీ వర్గానికి పంచడమే కాంగ్రెస్ ప్రభుత్వాల పని అంటూ రాజస్థాన్లోని బన్స్వారాలో జరిగిన సభలో మోడీ నిప్పులు చెరగడం వివాదానికి దారితీసింది.
ప్రధాని మోడీ ప్రసంగంలోని అభ్యంతరకర అంశాలపై ఇటీవల ఈసీకి కాంగ్రెస్ నేతల టీమ్ ఫిర్యాదును అందించింది. ఫిర్యాదులోని ప్రధాన అంశాల విషయానికొస్తే..
ప్రధాని మోడీ ప్రసంగంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం ఏమన్నారంటే..