Site icon HashtagU Telugu

Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు

EC has been protecting voter fraudsters for ten years: Mallikarjuna Kharge alleges

EC has been protecting voter fraudsters for ten years: Mallikarjuna Kharge alleges

Kharge : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల కమిషన్ (EC) వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ఈసీ ఓటు చోరీల్ని ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్యానికి చేటు చేస్తున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను జాబితాలోంచి తొలగించేందుకు జరిగిన కుట్రలను ఎన్నికల కమిషన్ గోప్యంగా ఉంచిందని ఆయన మండిపడ్డారు. మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ, ఈ కుట్రకు సంబంధించి కీలక సమాచారాన్ని ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ బయటపెట్టలేదని ఆరోపించారు.

Read Also: BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ

ఓటర్లకు సంబంధించిన కీలక సమాచారం దాచిపెట్టి, ఓట్ల తొలగింపుల వెనుక ఉన్న వర్గాలను ఎన్నికల కమిషన్ పరోక్షంగా కాపాడిందని ఖర్గే విమర్శించారు. స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నా దానిపై చర్యలు తీసుకోవడం లేదంటే, ఓటు హక్కును అణచివేయడానికే ఇది పరోక్ష సహకారమనే భావించాలి అన్నారు. ఓటర్లను మోసం చేయడానికి చేసిన ప్రయత్నాలను ఆపాల్సిన బాధ్యత ఈసీదే కానీ, దాని స్థానంలో రక్షకుడిగా మారిందని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో జరిగినదే ఇప్పుడు బిహార్‌లోనూ పునరావృతమవుతుందని ఖర్గే తీవ్రంగా హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ ద్వారా విజయాన్ని సాధించేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. బిహార్‌లో ఓటర్లను మోసం చేసి అధికారంలోకి రావాలన్నే ప్రయత్నం జరుగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని సహించదు అన్నారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న ఎన్నికల కమిషన్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా ఈసీ ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేసుకుంటూ, ఓటర్లను లక్ష్యంగా చేసుకున్న కుట్రలకు సహకరించింది.

చట్టాలను సైతం మార్చేందుకు వెనకాడలేదు అన్నారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమ మార్గాలు ఎంచుకుందని ఆయన ఆరోపించారు. బిహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ త్వరలో దేశవ్యాప్తంగా ఓ ప్రజాస్వామ్య ఉద్యమంగా మారుతుందని ఖర్గే తెలిపారు. ఓటు హక్కు అనేది (పవిత్రమైన) హక్కు అని గుర్తు చేస్తూ, దాన్ని ఎవరూ అపహరించలేరని హెచ్చరించారు. బీజేపీ ఈసీ చేతుల్లో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ తలకిందులవుతోంది. కానీ కాంగ్రెస్ ప్రజల తరపున పోరాటం చేస్తుంది అన్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్న ఎన్డీయే ప్రభుత్వం త్వరలో కూలిపోతుందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అనే మాయాజాలం ప్రజలకు ఇక నచ్చడం లేదని పేర్కొన్నారు. బిహార్‌లో ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న యాత్ర, దేశవ్యాప్తంగా ప్రజలలో ఆలోచనాపరమైన చైతన్యం తీసుకురాబోతోందని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: Submarine Cable : సబ్‌మరైన్ కేబుల్స్ పై దాడి.. ప్రపంచం ఎందుకు షాక్‌లో ఉంది?