పుణేలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. హైదరాబాద్-పుణే జాతీయ రహదారి పై మాటు వేసి ఐదుగురు నిందితులను DRI బృందం పట్టుకుంది. ఈ ఐదుగురు నిందితుల వద్ద భారీగా డ్రగ్స్ దొరికాయి. 51 కోట్ల విలువ చేసే 101 కేజీల Methaqualone డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. మారుతీ షిఫ్ట్ కారు లో ఐదు డబ్బాలలో డ్రగ్స్ ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. నిందితులను తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా కు చెందిన వారిగా గుర్తించారు తెలంగాణ లో ఎక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారని దానిపై డీఆర్ఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎంత కాలం నుండి ఈ దందా కొనసాగుతుంది అనే సమాచారాన్ని తెలుసుకునే పని లో అధికారులు ఉన్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారులో డ్రగ్స్ ను పుణే లోని ఏ ప్రాంతంకు తరలిస్తున్నారు? ఎవరికి ఈ డ్రగ్స్ ఇస్తున్నారు అనే వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. పట్టుబడ్డ నిందితులు డ్రగ్స్ ను వివిధ రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరు ఉన్నారనే దానిపై డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు.