ఉపరితలం నుండి గాల్లోకి పంపగలిగే తక్కువ రేంజ్ మిసైల్ ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని పరీక్షించారు.దీన్ని ఇండియన్ నేవీలో పలు నౌకల్లో వినియోగించనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఈ మిసైల్ విజయవంతమవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ అభినందనలు తెలిపారు.
ఈ మిషన్ కి సంబందించిన మొదటి ట్రయల్ గత ఫిబ్రవరి 22న జరిగింది. ఇండియన్ నేవీ డీఆర్డీవో సంయుక్తంగా చేసిన
ఈ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేజ్ టూ ఎయిర్ మిసైల్ పూర్తిగా ఇండియన్ టెక్నాలజీతో డెవలప్ చేశారు.
Vertical Launch Short Range Surface to Air Missile for @IndianNavy was flight tested from ITR Chandipur. The missile was tested against an electronic target at a low altitude. The weapon is planned for integration onboard naval ships. pic.twitter.com/vYGTMjXQNw
— DRDO (@DRDO_India) December 7, 2021
సర్ఫేజ్ నుండి ఆకాశంలోకి ప్రయోగించే ఈ నూతన మిసైల్స్ ను గతంలో వాడిన బరాక్ 1 స్థానంలో వాడనున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది.
ఆకాశంలో తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఈ VL-SRSAM మిసైల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,
2006 నాటి అస్త్ర మార్క్ 1 ద్వారా ఈ మిసైళ్లను డెవలప్ చేశామని నేవీ అధికారులు తెలిపారు. దానికి మరిన్ని అధునాతన ఫీచర్స్ చేర్చడం వల్ల ఇది 360 డిగ్రీల్లో లక్ష్యాలను కూడా ఈటార్గెట్ చేయగలదని డీఆర్డీవో ప్రకటించింది.