Indian Airlines: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అనేక నిబంధనలు సడలింపు..!

భారత్‌లో విమానం (Indian Airlines)లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారతీయ విమానయాన సంస్థలు కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను ప్రారంభించేందుకు

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 06:59 AM IST

Indian Airlines: భారత్‌లో విమానం (Indian Airlines)లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారతీయ విమానయాన సంస్థలు కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను ప్రారంభించేందుకు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి DGCA అనేక నిబంధనలను సడలించింది.

నిబంధనలను సడలించింది

DGCA ప్రకారం.. మునుపటి 33-పాయింట్ చెక్‌లిస్ట్ 10-పాయింట్ చెక్‌లిస్ట్‌గా హేతుబద్ధీకరించబడింది. నిబంధనల ప్రకారం.. ఇప్పుడు కంపెనీలు కొత్త ప్రదేశంలో విమానాలను నడపడానికి కేవలం 10 ప్రమాణాలను మాత్రమే పాటించాల్సి ఉంది. ప్రస్తుతం ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశ ఎయిర్ వంటి అనేక విమానయాన సంస్థలు తమ అంతర్జాతీయ స్థాయిలో పేరు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను ప్రారంభించేందుకు భారతీయ కంపెనీలకు నిబంధనలలో భారీ సడలింపులు ఇవ్వనున్నట్లు జూన్ 12న జారీ చేసిన ఉత్తర్వుల్లో డీజీసీఏ పేర్కొంది. నిబంధనల సడలింపుతో దేశీయ విమానయాన సంస్థలు విదేశీ నగరాలకు చేరుకోవడం మరింత సులభతరం కానుంది. ఏదైనా కొత్త అంతర్జాతీయ గమ్యస్థానానికి విమానాలను ప్రారంభించే ముందు కంపెనీల సంసిద్ధతను DGCA సమీక్షిస్తుంది. వారు అన్ని ప్రమాణాలకు సరిపోయే తర్వాత మాత్రమే విమానాలను ప్రారంభించేందుకు అనుమతిస్తారు.

Also Read: Double decker flight : విమానంలో డబుల్ డెక్కర్ సీట్ కాన్సెప్ట్.. అదిరిపోయింది క‌దా..

DGCA విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భారతీయ కంపెనీలకు నిర్దేశించిన ప్రమాణాలను సడలించారు. భారతీయ విమానయాన సంస్థలు విదేశీ నగరాల్లో తమ పరిధిని పెంచుకుంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, ఆకాస ఎయిర్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను పెంచేందుకు భారతీయ విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇండిగో తన కొత్త విమానాలను ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టులో కంపెనీ కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనుంది. అదేవిధంగా ఎయిర్ ఇండియా కూడా యూరప్, పశ్చిమాసియా దేశాలు, అమెరికాలకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. డిసెంబరు నాటికి అనేక కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను ప్రారంభించాలని ఆకాసా ఎయిర్ నిర్ణయించింది.