Site icon HashtagU Telugu

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల వేళ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్

Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే డబ్బు, మద్యం ఏరులై పారుతుంది. ప్రచారానికి, కార్యకర్తల ఖర్చులకు, సభలు, సమావేశాలకు డబ్బు ఉంటేనే పని జరుగుతుంది. అయితే ఇప్పుడు కేవలం డబ్బుంటే సరిపోవట్లేదు. ఎక్కడికైనా, ఎప్పుడైనా క్షణాల్లో వెళ్లేందుకు ఛార్టర్ విమానాలు, హెలికాప్టర్లసాయం తీసుకుంటున్నారు రాజకీయ నేతలు.

లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఇప్పటికే పూర్తి కావడంతో, మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు 80 శాతం ఉన్న మిగిలిన ఆరు దశలపై దృష్టి సారించింది. దీనికి ముందు రాజకీయ పార్టీలు ఛార్టర్ విమానాలు, హెలికాప్టర్లను కీలక సాధనాలుగా చేసుకుని ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దీని కారణంగా అందుబాటులో ఉన్న ఛార్టర్ విమానాలు, హెలికాప్టర్ల సరఫరా కంటే విమానాల డిమాండ్ 40-50 శాతం పెరిగింది.

We’re now on WhatsAppClick to Join

భారతదేశంలో దాదాపు 130 నమోదిత వాణిజ్య విమానాలు మరియు సమాన సంఖ్యలో హెలికాప్టర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఉన్నదానికంటే డిమాండ్లు మించిపోయాయి. ఎన్నికల ప్రచారానికి విదేశీ-రిజిస్టర్డ్ విమానాలను ఉపయోగించుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే భారతదేశంలో నమోదు చేయబడిన వాణిజ్య విమానాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో విమానాలను అద్దెకు ఇచ్చే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటోంది.నివేదిక ప్రకారం ఎన్నికల ప్రచారం కోసం చార్టర్ విమానాలు మరియు హెలికాప్టర్ల బుకింగ్‌లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. అందుబాటులో ఉన్న 80 శాతం విమానాలను బిజెపి బుక్ చేసిందని సమాంచారం. పార్టీ సీనియర్ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున మరిన్ని విమానాలను అద్దెకు తీసుకునేందుకు బీజేపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది.

Also Read; Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!