Assault Case : బిభవ్‌ కుమార్‌ బెయిల్‌ను తిరస్కరించిన హైకోర్టు

అతనికి బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి కారణం లేదని జస్టిస్‌ అనూప్‌ కుమార్‌ మెండిరట్ట బిభవ్‌ కుమార్‌ బెయిల్‌ పటిషన్‌ను తోసిపుచ్చారు.

  • Written By:
  • Publish Date - July 12, 2024 / 05:01 PM IST

Bibhav Kumar: ఆప్‌ రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్‌(MP Swati Maliwal) దాడి కేసులో బిభవ్‌ కుమార్‌కి బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అతనికి బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి కారణం లేదని జస్టిస్‌ అనూప్‌ కుమార్‌ మెండిరట్ట బిభవ్‌ కుమార్‌ బెయిల్‌ పటిషన్‌ను తోసిపుచ్చారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, దర్యాప్తు పూర్తయినందున తన కస్టడీని పొడిగింపు(Custody Extension) అవసరం లేదని పేర్కొంటూ బెయిల్‌ జారీ చేయాల్సిందిగా బిభవ్‌ కుమార్‌ పిటిషన్‌లో తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, మే13న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(CM Kejriwal) నివాసంలో బిభవ్‌ కుమార్‌ స్వాతిమలివాల్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. స్వాతి మలివాల్‌ ఫిర్యాదు మేరకు మే 18న పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

మే 13 న సంఘటన జరిగిన రోజు నుండి ముఖ్యమంత్రి నివాసం నుండి రెండు వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి, ఒకటి మలివాల్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి పాల్పడినట్లు చూపించగా, మరొకటి ఆమె సివిల్ లైన్స్‌లోని సిఎం నివాసం నుండి బయటకు వెళ్లినట్లు చూపించింది.

కుమార్ జైల్లో ఉన్నప్పటికీ మలివాల్ కు బెదిరింపులు వస్తున్నాయని మలివాల్ తరపు న్యాయవాది తెలిపారు. కుమార్ తన అమాయకత్వాన్ని ప్రశ్నిస్తూ, కుమార్ తన ఫోన్‌ను ఫార్మాట్ చేసారని మరియు సంఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజీని తొలగించారని ఆరోపించారు.

Read Also: IND vs ZIM: నాలుగో మ్యాచ్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి

 

 

 

 

 

 

 

 

Follow us