పైలట్లు జీతం పెంపుకోసం ఒకరోజు సమ్మెకు దిగడంతో జర్మన్ కు చెందిన లుఫ్తాన్సా విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది మంది నిరసనలు తెలుపుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానాలు రద్దు కావడంతో విమాన ఛార్జీలను వాపసు చేయాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. విమానాశ్రయం వద్ద ఢిల్లీ పోలీసులు, CISF ప్రయాణికులను శాంతింపజేశారు.
All @lufthansa flights cancelled..Sir, please help us..We are students, senior citizens and so many people stranded here in Indira Gandhi Aiport, Terminal 3.
We are stuck here. Staff has vanished @PMOIndia
No food, no accomodation, no flight rebooking@JM_Scindia 🙏 pic.twitter.com/McQMC0sys5— Sikander Sharma (@wokeman2022) September 1, 2022
ఎయిర్లైన్ కంపెనీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. ఫ్రాంక్ఫర్ట్ , మ్యూనిచ్లకు వెళ్లే ప్రయాణీకులు, చెకింగ్-ఇన్ ఏరియా వెలుపల 6 మరియు 7 వద్ద నిరసన తెలిపారు. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా శుక్రవారం నాడు 800 విమానాలను రద్దు చేసింది. దీంతో 130,000 మంది ప్రయాణికులపై సమ్మె ప్రభావం పడింది. విమానాల రద్దు ఫ్రాంక్ఫర్ట్ మరియు మ్యూనిచ్ విమానాశ్రయాలపై ప్రభావం చూపుతుందని లుఫ్తాన్స తెలిపింది.