Tax Terrorism: బీజేపీ ఐటీ నోటీసులపై దేశవ్యాప్తంగా నిరసనలు

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఐటీ నోటీసులు పంపింది బీజేపీ. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీతో సహా రూ.1,700 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అయితే బీజేపీ ఇచ్చిన నోటిసులపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమన్నది.

Published By: HashtagU Telugu Desk
Tax Terrorism

Tax Terrorism

Tax Terrorism: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఐటీ నోటీసులు పంపింది బీజేపీ. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీతో సహా రూ.1,700 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అయితే బీజేపీ ఇచ్చిన నోటిసులపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమన్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు అధికార బీజేపీ ‘పన్ను ఉగ్రవాదం’కు పాల్పడుతోందని ఆరోపించింది. .

ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌తో కలిసి పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదాయపు పన్ను చట్టాలను బీజేపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని, ఐటీ శాఖ బీజేపీ నుంచి రూ.4,600 కోట్లకు పైగా డిమాండ్‌ చేయాలని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ద్వారా బిజెపి 8,200 కోట్ల రూపాయలు వసూలు చేసిందని రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే మేము కుంగిపోవడం లేదని రమేష్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారం కొనసాగుతుందని, తమ హామీలను దేశ ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నోటీసులకు మేము భయపడము. మేము మరింత దూకుడుగా వ్యవహరిస్తాము మరియు ఈ ఎన్నికలలో పోరాడుతామని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు.

We’re now on WhatsAppClick to Join.

దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్న కాంగ్రెస్:
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ఐటీ కుట్రలపై వారాంతంలో దేశవ్యాప్త నిరసనలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కమిటీల సభ్యులు శనివారం మరియు ఆదివారం రోజు తమ తమ రాష్ట్రాల్లోని రాష్ట్ర మరియు జిల్లా ప్రధాన కార్యాలయాలలో సీనియర్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలతో భారీ బహిరంగ ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, ఫ్రంటల్‌ సంస్థల అధినేతలకు లేఖ రాశారు. సో రేపు, ఎల్లుండి అన్ని పిసిసిలు దేశవ్యాప్తంగా, ప్రతి జిల్లాలో నిరసనలు చేయనున్నాయి.

Also Read: BRS : బీఆర్‌ఎస్‌ కష్టకాలంలో వెళ్లడానికి కారణం ఇదేనా..?

  Last Updated: 29 Mar 2024, 08:15 PM IST