Congress: గులాం న‌బీ ఆజాద్ నివాసంలో జీ21 నేత‌ల మీటింగ్

న్యూఢిల్లీలోని రాజ్యసభ మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ నివాసంలో 'జీ21' విభాగంలోని కాంగ్రెస్ నేతలు బుధవారం సమావేశమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Congress Resort Politics In Goa

Congress Resort Politics In Goa

న్యూఢిల్లీలోని రాజ్యసభ మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ నివాసంలో ‘జీ21’ విభాగంలోని కాంగ్రెస్ నేతలు బుధవారం సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత జీ21 నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. జీ21లో భాగమైన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ నివాసంలో ఈ సమావేశం వాస్తవానికి జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్‌ నాయకత్వంపై కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో ఆగ్రహావేశాలకు లోనవడంతో చివరి క్షణంలో సభ వేదిక మారింది. కపిల్ సిబల్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడం ఇష్టం లేకనే సమావేశ వేదికను మార్చాలని జీ21 నేతలు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం నేపథ్యంలో జి21 నేతల సమావేశం జరిగింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశంలో రాజీనామా చేయాలని ప్రతిపాదించారు, అయితే CWC సభ్యులు ఆమెను రాజీనామా చేయవద్దని ఒప్పించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సీడబ్ల్యూసీ ఓ ప్రకటనలో పేర్కొంది. జీ2లో ఉన్న స‌భ్యులు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తిగా సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా అంతర్గత ఎన్నికల ద్వారా కొత్త అధ్యక్షుడిని నియమించాలని కోరుతున్నారు. జీ 23లోని ఇద్ద‌రు స‌భ్యులు ఇత‌ర పార్టీలో చేరండంతో ప్ర‌స్తుతం ఆ విభాగం జీ21గా ఉంది.

  Last Updated: 16 Mar 2022, 10:40 PM IST