Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra : భార‌త్ జోడో యాత్ర‌కు నితీష్‌, తేజ‌స్వి యాద‌వ్‌..!

Nitish Imresizer

Nitish Imresizer

బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాదవ్ భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొననున్నారు.ఈ మేర‌కు రాష్ట్ర ఇన్‌చార్జి భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌లను కలిసి పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో ప్రచారానికి ఆహ్వానించారు. ఇద్దరు నేతలు పాల్గొనేందుకు సమ్మతి తెలిపారని.. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేనందున, ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

అంతకుముందు రోజు భ‌క్త చ‌ర‌ణ్‌ దాస్, రాష్ట్ర చీఫ్ మదన్ మోహన్ ఝా సహా ఇతర నాయకులతో పాటు, నితీష్ కుమార్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కోటా కింద ఉన్న మంత్రులు, పార్టీ ప్రధాన కార్యాలయం సడకత్ ఆశ్రమంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి ఎంపికపై రెండు ప్రతిపాదనలు అంగీకరించారు. మదన్ మోహన్ ఝా పదవీకాలం కొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ నేత‌లు తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి ఏకగ్రీవంగా ఈ స‌మావేశంలో మద్దతు పలికారు.