Kharges Helicopter : ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఎన్డీయే నేతల హెలికాప్టర్లను చెక్ చేయరా ? : కాంగ్రెస్

Kharges Helicopter : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.

Published By: HashtagU Telugu Desk
Kharges Helicopter

Kharges Helicopter

Kharges Helicopter : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ప్రతిపక్ష నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించింది. శనివారం రోజు  బిహార్‌లోని సమస్తిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఎన్‌డీఏ కూటమిలోని పార్టీల నేతల హెలికాప్టర్లను(Kharges Helicopter) తనిఖీ చేయడం లేదు కానీ.. విపక్ష పార్టీల నేతల హెలికాప్టర్లపై ప్రత్యేక నిఘాను పెట్టడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను కూడా కేరళలో ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. ఈమేరకు  కాంగ్రెస్ పార్టీ బిహార్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి రాజేష్ రాథోర్  ఎక్స్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఖర్గే హెలికాప్టర్‌ను బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి తనిఖీ చేస్తున్న ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఆ వీడియోలో పోలీసులతో సహా ఎన్నికల అధికారులు హెలికాప్టర్‌ను తనిఖీ చేస్తున్న సీన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్డీయే కూటమి నేతల హెలికాప్టర్లను తనిఖీ చేసిన వీడియోలను విడుదల చేయాలని ఈసందర్భంగా  రాజేష్ రాథోర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని  డిమాండ్ చేశారు.

Also Read :CM Revanth Reddy : ఫుట్‌బాల్‌‌ ప్లేయర్‌గా మారిన సీఎం రేవంత్ రెడ్డి

బిహార్‌లో ఎన్నికల లెక్కలు ఇవీ.. 

బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తోంది.  దాని కూటమి భాగస్వాములు మిగిలిన 31 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రత్యేకించి 23 స్థానాల్లో రాష్ట్రీయ జనతాదళ్ బరిలోకి దిగింది. బిహార్‌లోని బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 5 స్థానాల్లో, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే కూటమి 39 లోక్‌సభ స్థానాలను గెలవగా, ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలిచింది.

Also Read : Telugu Students : విహార యాత్రలో విషాదం.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

  Last Updated: 12 May 2024, 01:37 PM IST