Char Dham Yatra : చార్‌ధామ్ యాత్ర పునఃప్రారంభం.. కొనసాగుతున్న సహాయక చర్యలు

గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి కొంత మెరుగుపడింది. అందువల్ల యాత్రపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. అని తెలిపారు. అయితే, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవసరమైతే వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని సూచించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Chardham Yatra resumes, relief efforts continue

Chardham Yatra resumes, relief efforts continue

Char Dham Yatra : ఉత్తరాఖండ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన పవిత్ర చార్‌ధామ్ యాత్ర సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితులు మెరుగవుతుండటంతో, యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని అధికారులు ఎత్తివేసారు. గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి కొంత మెరుగుపడింది. అందువల్ల యాత్రపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. అని తెలిపారు. అయితే, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవసరమైతే వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని సూచించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. యాత్రికుల భద్రతకు సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా వెల్లడించారు.

Read Also: AP News : కారులో డెడ్ బాడీల కలకలం

కాగా, ఆదివారం ఉత్తరాఖండ్‌లో కురిసిన మినహా వర్షం కారణంగా బార్కోట్ సమీపంలోని సిలై బ్యాండ్ వద్ద మేఘ విస్ఫోటనం చోటుచేసుకుంది. దీని వల్ల యమునోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి భారీ విధ్వంసాన్ని కలిగించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. మృతులను నేపాల్‌కు చెందిన కేవల్ బిస్త్ (వయసు 43), ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన దుజే లాల్ (వయసు 55)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికారులు, సహాయ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన బార్కోట్-యమునోత్రి రహదారిలోని ముఖ్యమైన భాగాలను అత్యవసరంగా మరమ్మతులు చేసి, తిరిగి రాకపోకలను ప్రారంభించారు. ఉత్తరాకాశి జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య మాట్లాడుతూ.. మేఘ విస్ఫోటనం వల్ల దెబ్బతిన్న మార్గాల్లో ఒక భాగాన్ని సరిచేసాం. మిగతా భాగాల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి అని వివరించారు.

ప్రస్తుతం యాత్ర పునరుద్ధరమైనప్పటికీ, వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని యాత్రికులకు అధికారులు సూచిస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో వర్షాలు ఎప్పుడైనా తీవ్రమవవచ్చు కాబట్టి, అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. చార్‌ధామ్ యాత్ర హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్‌లను కలిపిన యాత్ర. ఈ యాత్ర సంవత్సరానికి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం అధికంగా ఉండటంతో, అధికారులు ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పునఃసమీక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి యాత్ర మళ్లీ ప్రారంభమైనప్పటికీ, భద్రతకే ప్రాముఖ్యతనిస్తూ అధికార యంత్రాంగం మరిన్ని జాగ్రత్త చర్యలను అమలు చేస్తోంది.

Read Also: Delhi : ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

 

 

  Last Updated: 30 Jun 2025, 11:35 AM IST