Diwali : దీపావళి రోజున.. కేవలం 2 గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చాలంటూ ప్రభుత్వం ఆదేశం

ఈసారి దీపావళి రోజున కేవలం 2 గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు పటాకులు కాల్చాలని , అది కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తామని

Published By: HashtagU Telugu Desk
Diwali Safety Tips

Diwali Safety Tips

దీపావళి (Diwali) అంటేనే టపాసుల మోత (Diwali Crackers) మోగాల్సిందే..ఎవరు ఎక్కువ టపాసులు కాలిస్తే వారే తోపు..టపాసుల సౌండ్ తో దద్దరిల్లిపోవాల్సిందే..ఇలా ప్రతి ఒక్కరు భవిస్తూ..దీపావళి పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటుంటారు. కానీ ఈ ఒక్క రోజు వల్ల గాలి కాలుష్యం ఎంతో అవుతుందో..దాని వల్ల ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయి చాలామంది పట్టించుకోరు. అందుకే దీపావళి వస్తుందంటే పర్యావరణ నిపుణులు పలు జాగ్రత్తలు , సూచనలు తెలియజేస్తుంటారు. తాజాగా చండీగఢ్‌ అధికార యంత్రాంగం ఈ దీపావళికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

చండీగఢ్‌ (Chandigarh )లో ప్రతి సంవత్సరం దీపావళి నాడు అధిక మోతాదులో గాలి కలుషితమవుతుందట. అందుకే ఈసారి దీపావళి రోజున కేవలం 2 గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు పటాకులు కాల్చాలని , అది కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కూడా పటాకులు కాల్చడం, అమ్మడం నిషేధించారు. చలికాలంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది కూడా ఢిల్లీలో అన్ని రకాల పటాకుల అమ్మకాలు, నిల్వలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

Read Also : Samantha: హాలీడే మూడ్ లో సమంత, నెక్ట్స్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

  Last Updated: 06 Oct 2023, 04:07 PM IST