Site icon HashtagU Telugu

Population Census : జనగణనకు భారత్ రెడీ.. ఏమేం చేస్తారో తెలుసా ?

Population Census

Population Census

Population Census : మనదేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు. కనీసం ప్రతీ పదేళ్లకోసారి జనగణన నిర్వహించడం ప్రామాణికం.  అయితే 2021లో మళ్లీ చేపట్టాల్సిన జనాభా లెక్కలు..  కరోనా తదితర కారణాలతో వాయిదాపడ్డాయి. అయితే అదే టైంలో ప్రజలు ఇళ్లలో ఉండటాన్ని అనుకూలంగా భావించి.. అమెరికా, రష్యా, యూకే, బ్రెజిల్‌, చైనా, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు జనాభా లెక్కల కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్‌గా నిర్వహించాయి. కానీ మనం మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోయాం. ఇక ఈసారి  జనగణనకు భారత సర్కారు గట్టి ముహూర్తాన్ని ఖరారు చేయనుందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మనదేశంలో జనగణన జరుగుతుందని సమాచారం. అందులో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లోనూ జనగణన కార్యక్రమం నిర్వహణకు నిధులు కూడా కేటాయించారు. జనాభా లెక్కల సేకరణ కోసం దేశంలో దాదాపు 3లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.  12నెలలపాటు జనగణన(Population Census) ప్రక్రియ కొనసాగుతుందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : WhatsApp : వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లను ఇక స్క్రీన్ షాట్ తీయలేరు

Also Read :CM Revanth Reddy : సంచలనంగా మారిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్..!