Central Govt : చెత్త అమ్మితే కేంద్రానికి రూ.2వేల కోట్లు వచ్చాయా..!!

గత మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ. 2,364 కోట్లు ఆర్జించింది

Published By: HashtagU Telugu Desk
Jitendra Singh

Jitendra Singh

కేంద్ర ప్రభుత్వం స్క్రాప్‌ల విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటోంది. గత మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ. 2,364 కోట్లు ఆర్జించింది. ఈ విషయాన్ని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) ద్వారా వెల్లడించబడింది.

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ “ఎక్స్” (మాజీగా ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో ఈ వివరాలను పంచుకున్నారు. ప్రభుత్వం ఎన్ని చోట్ల స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించిందో ఆయన పోస్ట్‌లో తెలిపారు. ఎన్ని ఫిజికల్ ఫైల్స్‌ని క్లీన్ చేశారో, ఎన్ని ఇ-ఫైళ్లను క్లీన్ చేశారో కూడా చెప్పారు. ఈ ప్రచారం ద్వారా ప్రభుత్వానికి ఈ ఏడాది రూ.650.10 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ చేసిన ఈ పనిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. “‘ప్రశంసనీయమైనది! సమర్థవంతమైన నిర్వహణ, చురుకైన చర్యపై దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రయత్నం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. సమిష్టి కృషి శాశ్వత ఫలితాలను ఎలా సాధించగలదో చూపిస్తుంది.’ అని మోడీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Read Also : Face Serum : ఇంట్లోనే ఈ ఫేస్ సీరమ్ తయారు చేసుకోండి.. ముడతలు, పిగ్మెంటేషన్, మచ్చలకు చెక్‌ పెట్టండి..!

  Last Updated: 10 Nov 2024, 07:43 PM IST