CBSE – No Grades : ఇక నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్లలో మార్కుల శాతం, గ్రేడ్లను ఇవ్వబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రకటించింది. ఉన్నత విద్య లేదా ఉద్యోగంలో మార్కుల శాతం అవసరమైతే.. అడ్మిషన్ ఇచ్చిన సంస్థే విద్యార్థి ఐదు బెస్ట్ సబ్జెక్ట్లను నిర్ణయించుకోవాలని సూచించింది. కొన్నాళ్ల క్రితమే మెరిట్ జాబితాను విడుదల చేసే పద్ధతిని సీబీఎస్ఈ తొలగించింది. ఇప్పుడు తాజాగా ఈ మార్పుపై అనౌన్స్మెంట్ చేసింది. ఈమేరకు వివరాలను సీబీఎస్ఈ ఎగ్జామినర్ భరద్వాజ వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)-2020 సిఫార్సుల మేరకు సీబీఎస్ఈ ఈ ఏడాది చాలా కీలక నిర్ణయాలను తీసుకుంది.
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు రాయడం తప్పనిసరేమీ కాదని కేంద్ర విద్యాశాఖ అక్టోబరు 8న ప్రకటించింది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
- వచ్చే (2024) విద్యా సంవత్సరం నుంచి పరీక్షలలో అత్యధిక మార్కులు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకే కేటాయిస్తామని సీబీఎస్ఈ తెలిపింది. షార్ట్, లాంగ్ ఆన్సర్ టైప్ ప్రశ్నలకు ఇంతకుముందు ఉన్న మార్కుల వెయిటేజీని తగ్గిస్తామని వెల్లడించింది.
- విద్యార్థులు రాసే జవాబు పత్రాల వ్యాల్యుయేషన్ పద్ధతిలోనూ పలు మార్పులు చేస్తామని సీబీఎస్ఈ(CBSE – No Grades) పేర్కొంది.