Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు (CBI Raids) చేపట్టారు. శనివారం ఉదయం నుంచి పశ్చిమబెంగాల్లోని కోల్కతా (Kolkata) నివాసంతో పాటు ఇతర నగరాల్లోని మహువాకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, యాంటీ కరప్షన్ అంబుడ్స్మన్ లోక్పాల్ మహువా కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా సోదాలు చేపట్టింది. మరోవైపు ఈ కేసు కారణంగా మహువా లోక్సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని క్రిష్ణానగర్ స్థానం నుంచి ఆమె మళ్లీ బరిలోకి దిగుతున్నారు.
read also: Atishi: కేజ్రీవాల్ అరెస్టుపై మంత్రి అతిషి కీలక ఆరోపణలు
లోక్పాల్ సూచనల మేరకు సిబిఐ గురువారం టిఎంసి మాజీ ఎంపి మహువా మొయిత్రాపై డబ్బు తీసుకున్నందుకు ప్రశ్నలు అడిగిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణలో తేలిన తర్వాత లోక్పాల్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది. మొయిత్రాపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఆరు నెలల్లోగా ఈ కేసులో తన నిర్ధారణలను సమర్పించాలని లోక్పాల్ సీబీఐని ఆదేశించింది. “అనైతిక ప్రవర్తన” కారణంగా గత ఏడాది డిసెంబర్లో లోక్సభ మొయిత్రాను బహిష్కరించింది. మాజీ ఎంపీ తన బహిష్కరణను హైకోర్టులో సవాలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ లోక్సభ స్థానం నుండి ఆమె మళ్లీ టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.