Site icon HashtagU Telugu

Business Ideas: దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఫుల్ డిమాండ్.. ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం..!

Post Office Saving Schemes

Post Office Saving Schemes

Business Ideas: వ్యవసాయం, సాంకేతికత పద్ధతి రెండూ నిరంతరం మారుతూ ఉంటాయి. వరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలను పండించకుండా ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో రైతులు పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇటువంటి వ్యవసాయంలో ఒకటి రబ్బరు (Rubber). దీనిలో ఒక చెట్టు రైతుకు 40 సంవత్సరాలు పాటు సంపాదించగలదు. రోజువారీ వినియోగ ఉత్పత్తులలో కూడా రబ్బరు (Rubber) వాడకం పెరుగుతోంది. రైతులు దీనిని సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలో బాగా సంపాదించవచ్చు. అందుకే రబ్బరు సాగు చేసి అధికంగా సంపాదించవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు.

నేడు దేశంలోని అనేక ప్రాంతాలలో రైతులు రబ్బరు సాగు ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. కాగా మన దేశంలో కేరళ అతిపెద్ద రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ప్రసిద్ధి చెందింది. దీని తరువాత త్రిపుర పేరు వస్తుంది. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా రబ్బరు ఎగుమతి అవుతుంది.

ఇలా వ్యవసాయం చేయండి..!

రబ్బరు సాగుకు లేటరైట్ ఎర్రమట్టి నేల ఉత్తమంగా పరిగణించబడుతుంది. నేల pH స్థాయి 4.5 నుండి 6.0 మధ్య ఉండాలి. మొక్కలు నాటడానికి సరైన సమయం జూన్-జూలై. రబ్బరు మొక్కలకు ఎక్కువ నీరు అవసరం. పొడి కారణంగా మొక్క బలహీనంగా మారుతుంది. దీనికి తరచుగా నీరు అవసరం.

భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు..?

ఈ రోజుల్లో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో రబ్బరు సాగు చేస్తున్నారు. రబ్బర్ బోర్డు లెక్కల ప్రకారం.. త్రిపురలో 89,264 హెక్టార్లు, అస్సాంలో 58,000 హెక్టార్లు, మేఘాలయలో 17,000 హెక్టార్లు, నాగాలాండ్‌లో 15,000 హెక్టార్లు, మణిపూర్‌లో 4,200 హెక్టార్లు, మిజోరాంలో 4,200 హెక్టార్లు, అరుణాచల్ ప్రదేశ్ 70 హెక్టార్లలో సహజ రబ్బరు సాగు చేస్తున్నారు.

Also Read: PM Modi in Egypt: ఈజిప్టులో ప్రధాని మోదీ.. రెండో రోజు పూర్తి షెడ్యూల్ ఇదే..!

ఏఏ దేశాలకు రబ్బరు ఎగుమతి అవుతుంది..?

సహజ రబ్బరు భారతదేశం నుండి జర్మనీ, బ్రెజిల్, అమెరికా, ఇటలీ, టర్కీ, బెల్జియం, చైనా, ఈజిప్ట్, నెదర్లాండ్స్, మలేషియా, పాకిస్తాన్, స్వీడన్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక పరిశోధన ప్రకారం.. 2020 సంవత్సరంలో భారతదేశం నుండి సుమారు 12,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ సహజ రబ్బరు ఎగుమతి చేశారు.

ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి సంపాదించవచ్చు..!

రబ్బరు చెట్టు పాలు దానిలో రంధ్రం చేసి సేకరిస్తారు. దీనిని రబ్బరు పాలు అంటారు. దీని తరువాత సేకరించిన రబ్బరు పాలు రసాయనంతో పరీక్షించబడతాయి. దాని నుండి మంచి నాణ్యమైన రబ్బరు తయారు చేయబడుతుంది. ఈ రబ్బరు షూల్స్, టైర్లు, ఇంజిన్ సీల్స్, బంతులు, సాగే బ్యాండ్లు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రబ్బరు సాగుతో 40 ఏళ్లపాటు లాభాలను ఆర్జించవచ్చు. రబ్బరు మొక్క ఐదేళ్లలో చెట్టు అవుతుంది. దీని తర్వాత దానిలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం

రబ్బరు పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు నుండి కూడా ఆర్థిక సహాయం అందుతుంది. అడవిలో పెరిగే రబ్బరు చెట్లు సాధారణంగా 43 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అయితే వాణిజ్య అవసరాల కోసం పెరిగేవి కాస్త చిన్నవిగా ఉంటాయి. ఈ విధంగా మీరు రబ్బరు సాగు ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.